దర్శకుడు శేఖర్ కమ్ముల, నాని కాంబోపై వస్తున్న వార్తలు టాలీవుడ్లో ఆసక్తికరంగా మారాయి. శేఖర్ కమ్ముల మార్క్ సున్నితమైన ‘క్లాస్’ కథను నాని సున్నితంగా తిరస్కరించినట్లు సమాచారం. ‘దసరా’, ‘సరిపోదా శనివారం’ వంటి చిత్రాలతో ప్రస్తుతం నాని ‘మాస్’ ఇమేజ్పై దృష్టి పెట్టాడట. తన ప్రస్తుత మార్కెట్ లెక్కల దృష్ట్యా ఈ నిర్ణయం తీసుకున్నట్లు తెలుస్తోంది.
పవన్ కళ్యాణ్, హరీష్ శంకర్ కాంబోలో వస్తున్న ‘ఉస్తాద్ భగత్ సింగ్’ మార్చి 19న విడుదల కానుంది. US మార్కెట్లో ఈ సినిమా రికార్డు సృష్టిస్తోంది. నార్త్ అమెరికాలో ప్రీ సేల్స్ ఇప్పటికే 250K డాలర్ల గ్రాస్ మార్కును దాటినట్లు డిస్ట్రిబ్యూటర్లు తెలిపారు. ప్రీమియర్లకు ఇంకా ఒకరోజు సమయం ఉండగానే ఈ స్థాయి వసూళ్లు రావడం ఈ మూవీ గ్రాండ్ ఓపెనింగ్స్కు సంకేతమని సినీ వర్గాలు తెలిపాయి.
‘ధురంధర్ 2’ బాక్సాఫీస్ వద్ద సంచలనం సృష్టిస్తోంది. మార్చి 19న విడుదల కానున్న ఈ మూవీ పెయిడ్ ప్రివ్యూలు, అడ్వాన్స్ బుకింగ్స్తో రికార్డులు తిరగరాస్తోంది. ప్రివ్యూల ద్వారా రూ.40.54 కోట్లు, తొలిరోజు బుకింగ్స్తో రూ.29 కోట్లు రాగా, ఓవర్సీస్లో రూ.60 కోట్లు వచ్చినట్లు టాక్. మొత్తంగా రిలీజ్కు ముందే రూ.130 కోట్లు సాధించి సత్తా చాటిందని ట్రేడ్ వర్గాలు తెలిపాయి.
‘ధురంధర్ 2’ బాక్సాఫీస్ వద్ద సంచలనం సృష్టిస్తోంది. మార్చి 19న విడుదల కానున్న ఈ మూవీ పెయిడ్ ప్రివ్యూలు, అడ్వాన్స్ బుకింగ్స్తో రికార్డులు తిరగరాస్తోంది. ప్రివ్యూల ద్వారా రూ.40.54 కోట్లు, తొలిరోజు బుకింగ్స్తో రూ.29 కోట్లు రాగా, ఓవర్సీస్లో రూ.60 కోట్లు వచ్చినట్లు టాక్. మొత్తంగా రిలీజ్కు ముందే రూ.130 కోట్లు సాధించి సత్తా చాటిందని ట్రేడ్ వర్గాలు తెలిపాయి.
పవర్ స్టార్ పవన్ కళ్యాణ్, దర్శకుడు హరీష్ శంకర్ కాంబోలో వస్తున్న మూవీ ‘ఉస్తాద్ భగత్ సింగ్’. మార్చి 19న విడుదల కానున్న ఈ సినిమాపై భారీ అంచనాలు నెలకొన్నాయి. ఈ సినిమాలో తమిళ సీనియర్ డైరెక్టర్ K.S రవికుమార్ కీలక పాత్రలో నటించనున్నాడు. ఈ విషయాన్ని దర్శకుడు హరీష్ చెప్పాడు. ఇక ఈ సినిమాలో శ్రీలీల, రాశి ఖన్నా, R. పార్తీబన్ తదితరులు కీలక పాత్రలు పోషించారు.
పవర్ స్టార్ పవన్ కళ్యాణ్, దర్శకుడు హరీష్ శంకర్ కాంబోలో వస్తున్న మూవీ ‘ఉస్తాద్ భగత్ సింగ్’. మార్చి 19న విడుదల కానున్న ఈ సినిమాపై భారీ అంచనాలు నెలకొన్నాయి. ఈ సినిమాలో తమిళ సీనియర్ డైరెక్టర్ K.S రవికుమార్ కీలక పాత్రలో నటించనున్నాడు. ఈ విషయాన్ని దర్శకుడు హరీష్ చెప్పాడు. ఇక ఈ సినిమాలో శ్రీలీల, రాశి ఖన్నా, R. పార్తీబన్ తదితరులు కీలక పాత్రలు పోషించారు.
ఆస్కార్ వేడుకల్లో ధర్మేంద్రకు తగిన గౌరవం దక్కలేదనే విమర్శలపై ఆయన కుమార్తె ఈషా స్పందించింది. తన తండ్రి ఎప్పుడూ గుర్తింపు కోసం ఆశపడలేదని, ఇలాంటి వేడుకలను ఆయన అస్సలు పట్టించుకోరని స్పష్టం చేసింది. హేమమాలిని సైతం స్పందిస్తూ.. ధర్మేంద్రను విస్మరించడం బాధాకరమే అయినా, కోట్లాది మంది అభిమానుల ప్రేమే ఆయనకు అసలైన అవార్డు అని పేర్కొంది.
మార్చి 19న విడుదల కానున్న పవన్ కళ్యాణ్ ‘ఉస్తాద్ భగత్ సింగ్’ చిత్రంపై అంచనాలు భారీగా ఉన్నాయి. ఈ క్రమంలో శ్రీలీల చేసిన వినూత్న ప్రమోషన్ సోషల్ మీడియాను ఊపేస్తోంది. సినిమాలోని మాస్ డైలాగ్ను ప్రతిబింబించేలా ఆమె ఒక ప్రత్యేకమైన టీషర్ట్ ధరించింది. దానిపై ‘ఇచ్చిపడేసే గోత్రం.. ఇరగదీసే నక్షత్రం’ అనే కొటేషన్ ఉంది. ఈ వెరైటీ ప్రమోషన్ పవన్ ఫ్యాన్స్ను విపరీతంగా ఆకట్టుకుంటోంది.
వెంకటేష్, దర్శకుడు త్రివిక్రమ్ కాంబోలో రాబోతున్న సినిమా ‘ఆదర్శ కుటుంబం’. తాజాగా ఈ సినిమా విడుదల తేదీ ఖరారైనట్లు తెలుస్తోంది. ఈ చిత్రాన్ని గాంధీ జయంతి సందర్భంగా అక్టోబర్ 2న ప్రపంచవ్యాప్తంగా రిలీజ్ చేయనున్నట్లు మేకర్స్ ప్లాన్ చేస్తున్నారు. కాగా, ఇప్పటికే ఈ మూవీ 40% షూటింగ్ పూర్తి చేసుకుంది. ఇక ఈ సినిమాలో శ్రీనిధి శెట్టి, నారా రోహిత్, యోగిబాబు కీలక పాత్రలు పోషిస్తున్నారట.
పాకిస్థానీ సింగర్ హసన్ జహంగీర్ తన ఐకానిక్ సాంగ్ ‘హవా హవా’ గురించి ఆసక్తికర విషయాలు పంచుకున్నాడు. ఈ పాటను రీసెంట్గా రూ. 1000 కోట్లకు పైగా వసూలు చేసిన ఓ భారీ చిత్రంలో వాడినందుకు, మేకర్స్ తన అనుమతి తీసుకుని 50 వేల డాలర్లు (రూ. 46 లక్షలు) చెల్లించారని తెలిపాడు. ఆయన ‘ధురంధర్’ గురించి చెబుతున్నారని ననెటిజన్లు చర్చించుకుంటున్నారు.
వరుస సినిమాలతో బిజీగా ఉన్న కిరణ్ అబ్బవరం త్వరలో మెగాఫోన్ పట్టబోతున్నాడు. ఆయన దర్శకత్వం వహించనున్న ఈ క్రేజీ ప్రాజెక్ట్ స్క్రిప్ట్ పనులు పూర్తయ్యాయట. 2026 మే నెలలో షూటింగ్ ప్రారంభం కానున్నట్లు టాక్. ఇందులో కీలక పాత్రల కోసం అరవింద్ స్వామి, రాజ్ బి. శెట్టిలను సంప్రదిస్తున్నట్లు సమాచారం. వైవిధ్యమైన కథాంశంతో ఈ సినిమా రాబోతుందట.
అక్కినేని అఖిల్, మురళీ కిషోర్ అబ్బూరి కాంబోలో వస్తున్న మూవీ ‘లెనిన్’. రాయలసీమ నేపథ్యంలో సాగే ఈ సినిమాలో అఖిల్ యాక్షన్ సీన్స్, ముఖ్యంగా ఇంటర్వెల్ సీక్వెన్స్ హైలైట్గా నిలుస్తాయని సమాచారం. భాగ్యశ్రీ బోర్సే హీరోయిన్గా నటిస్తుండగా, వీరిద్దరి మధ్య లవ్ సీన్స్ అలరించనున్నాయి. ఈ సినిమా అఖిల్ కెరీర్లోనే స్పెషల్గా నిలుస్తుందని ఫ్యాన్స్ ఆశిస్తున్నారు.
ప్రముఖ హెయిర్ స్టైలిస్ట్ మార్స్ మృతి పట్ల నటి జాన్వీ కపూర్ తీవ్ర భావోద్వేగానికి గురైంది. సోషల్ మీడియాలో అతనితో ఉన్న జ్ఞాపకాలను పంచుకుంటూ నివాళులు అర్పించింది. షూటింగ్ సెట్స్లో గడిపిన క్షణాలను గుర్తు చేసుకుంటూ.. ప్రతిరోజూ అతనిని మిస్ అవుతానని పేర్కొంది. గత రెండేళ్లుగా తన ప్రయాణంలో మార్స్ కీలక భాగమని, అతని మరణం తీరని లోటని ఆవేదన వ్యక్తం చేసింది.
సమంత తన బెడ్రూం ఫొటోను SMలో పంచుకుని అందరి దృష్టిని ఆకర్షించింది. ఇటీవల దర్శకుడు రాజ్ నిడిమోరును ఆమె రెండో వివాహం చేసుకున్న సంగతి తెలిసిందే. ఆ ఫొటోలో రాజ్ నిడిమోరు బెడ్రూంలో పడుకోకుండా ల్యాప్టాప్ ముందు కూర్చుని పనిలో బిజీగా ఉన్నట్లు కనిపిస్తోంది. బెడ్రూమ్లో కూడా ఆయన ఇంత బిజీగా పని చేస్తున్నాడని సరదాగా పేర్కొంటూ ఈ పోస్ట్ను షేర్ చేసింది.
టాలీవుడ్ హీరోయిన్ రాశీ ఖన్నా ఆసక్తికర వ్యాఖ్యలు చేసింది. తాను ‘ఉస్తాద్ భగత్ సింగ్’ మూవీ ఒప్పుకున్నప్పుడే పవన్ షెడ్యూల్స్ ఎలా ఉంటాయో చెప్పలేమని హరీష్ శంకర్ తనకు చెప్పినట్లు తెలిపింది. ‘పవన్ మీద ఇష్టంతో నా డేట్స్ సర్దుబాటు చేసుకుంటానని చెప్పా. ఈ సినిమా కోసం కొన్నిసార్లు పగలు రాత్రి తేడా లేకుండా 24 గంటలు పని చేశా. అదొక మర్చిపోలేని అనుభవం’ అని చెప్పుకొచ్చింది.