గాయత్రి భార్గవి నటిగా, యాంకర్గా మంచి గుర్తింపు తెచ్చుకుంది. ప్రస్తుతం ఆమె ‘డాటర్ ఆఫ్ ప్రసాద్ రావు కనపడుటలేదు’ సిరీస్లో నటించింది. తాజాగా ఓ ఈవెంట్లో ఆమె మాట్లాడుతూ.. ‘మేమంతా ఆర్టిస్టులుగా ఆకలితో ఉన్నాం. అవకాశాలిస్తే తినేస్తాం. మేం కూడా ఉన్నామని గుర్తించండి. విమానమే ఎక్కి రావక్కర్లేదు.. లోకల్గా కార్లు, ట్రైన్లు కూడా ఎక్కి వచ్చి చేయొచ్చు’ అని తెలిపింది.