JN: రాష్ట్ర వైద్యారోగ్య శాఖ మంత్రి దామోదర రాజనర్సింహను పాలకుర్తి ఎమ్మెల్యే యశస్వినిరెడ్డి కలిసి వినతిపత్రం అందజేశారు. కొడకండ్ల ఆసుపత్రిని 30 పడకల ఆసుపత్రిగా అప్గ్రేడ్ చేయాలని, పాలకుర్తి నియోజకవర్గంలో వైద్యరంగ బలోపేతానికి సహకరించాలని మంత్రిని ఎమ్మెల్యే కోరారు. వైద్యరంగ బలోపేతానికి ప్రజాప్రభుత్వం ప్రత్యేక చర్యలు తీసుకుంటుందని ఎమ్మెల్యే చెప్పారు.