సూపర్ స్టార్ రజినీకాంత్ నటించిన ‘కూలీ’ ప్రపంచవ్యాప్తంగా రూ.500 కోట్లకుపైగా కలెక్షన్లు రాబట్టినట్లు సినీవర్గాలు తెలిపాయి. విడుదలైన 12 రోజుల్లోనే ఈ ఘనత సాధించినట్లు పేర్కొన్నాయి. మరోవైపు Jr. NTR, హృతిక్ నటించి ‘వార్-2’ ప్రపంచవ్యాప్తంగా రూ.327 కోట్లకుపైగా వసూలు చేసినట్లు వెల్లడించాయి. తెలుగులో ఈ మూవీ రూ.62.10 కోట్ల గ్రాస్ కలెక్ట్ చేసిందని తెలిపాయి.
ప్రముఖ రియాలిటీ షో ‘బిగ్బాస్-9’ SEP 5న ప్రారంభం కాబోతుంది. ఈ షోలో ‘నువ్వు నాకు నచ్చావ్’ ఫేమ్ ఆశా సైనీ, ‘బుజ్జిగాడు’ ఫేమ్ సంజన, ముద్దమందారం సీరియల్ హీరోయిన్ తనూజ గౌడ పాల్గొనబోతున్నట్లు సోషల్ మీడియాలో ప్రచారం సాగుతోంది. ఈసారి సెలబ్రిటీలతో పాటు సామాన్యులకు కూడా అవకాశం కల్పిస్తున్నారు. ఇందుకోసం ‘అగ్నిపరీక్ష’ పేరుతో షో కండక్ట్ చేసి సామాన్య ...
దుల్కర్ సల్మాన్ హీరోగా, సముద్రఖని, భాగ్యశ్రీ బోర్సే ప్రధాన పాత్రధారులుగా తెరకెక్కుతున్న చిత్రం ‘కాంత’. సెల్వమణి సెల్వరాజ్ ఈ చిత్రానికి దర్శకుడిగా వ్యవహరిస్తున్నాడు. సెప్టెంబరు 12న ఈ చిత్రం ప్రేక్షకుల ముందుకు రానున్న విషయం తెలిసిందే. అయితే ఈ చిత్రం వాయిదా పడినట్లుగా తెలుస్తోంది. దీనిపై త్వరలో అధికారక ప్రకటన వచ్చే అవకాశం ఉంది.
కోలీవుడ్ హీరో జయం రవి తిరుమల శ్రీవారిని దర్శించుకున్నారు. సింగర్ కెన్నీషాతో కలిసి రావడంతో.. ఈ ఫొటోలు SMలో వైరల్ అవుతున్నాయి. తన భార్య ఆర్తితో విడాకుల వివాదం తర్వాత వీరిద్దరు జంటగా కనిపించారు. తాజాగా, తిరుమలలో సందడి చేశారు. సంప్రదాయ దుస్తుల్లో వచ్చి స్వామివారికి మొక్కలు చెల్లించుకున్నారు. మరోవైపు జయం రవి ‘కరాటే బాబు’, ‘పరాశక్తి’ లాంటి ప్రాజెక్టుల్లో నటిస్తున్న...
గౌతమ్ తిన్ననూరి దర్శకత్వంలో విజయ్ దేవరకొండ హీరోగా, భాగ్యశ్రీ బోర్సే హీరోయిన్గా నటించిన యాక్షన్ ఎంటర్టైనర్ మూవీ ‘కింగ్డమ్’. ఇందులో సత్యదేవ్ కీలక పాత్ర పోషించాడు. జూలై 31న ఈ సినిమా రిలీజ్ కాగా.. ఆగస్టు 27న వినాయక చవితి సందర్భంగా నెట్ఫ్లిక్స్లోకి రానుంది. తెలుగు, తమిళ, హిందీ, కన్నడ, మలయాళ భాషల్లో స్ట్రీమింగ్ కానుంది. ఈ మేరకు పోస్టర్ రిలీజ్ చేశారు.
బాలీవుడ్ స్టార్ హీరో వరుణ్ ధావన్, జాన్వీ కపూర్ కాంబినేషన్లో వస్తున్న లేటెస్ట్ మూవీ ‘సన్నీ సంస్కారి కి తులసి కుమారి’. అక్టోబర్ 2న రిలీజ్ కానుంది. టీజర్ ఆగస్టు 28న రానున్నట్లు మూవీ మేకర్స్ అప్డేట్ ఇచ్చింది. ‘పెళ్లికి మండపం రెడీ చేశాక.. సన్నీ, కుమారి ఎంట్రీతో పరిస్థితి అంతా మారిపోతుంది’ అనే క్యాప్షన్ జత చేసి జాన్వీతో క్లోజ్గా ఉన్న పోస్టర్ను షేర్ చేశారు.
తెలుగు సినీ కార్మికుల సమ్మె అల్లు అర్జున్, అట్లీ సినిమాపై ప్రభావం చూపిందని నిర్మాత బన్నీ వాసు తేలిపారు. సాధారణంగా ముంబై షూటింగ్స్పై సమ్మె ప్రభావం ఉండదు, కానీ ఈ సినిమా బడ్జెట్ ఎక్కువగా ఉండటంతో టెక్నీషియన్స్ అందుబాటులో లేక షూటింగ్స్ ఆగిపోయాయని నిర్మాత బన్నీ వాసు తెలిపారు. ఈ సమ్మె వల్ల నిర్మాతలపై ఆర్థిక భారం పడిందని, సమ్మె వల్ల అందరికీ నష్టమేనని ఆయన అన్నారు.
సినీ ఇండస్ట్రీలో మరో విషాదం చోటుచేసుకుంది. KGF సినిమాలో బాంబే డాన్ ‘శెట్టి’ పాత్రలో నటించిన దినేశ్ మంగళూరు కన్నుమూశారు. కర్ణాటకలోని మంగళూరుకు చెందిన ఆయన కొన్నిరోజులుగా అనారోగ్యంతో బాధపడుతున్నారు. ఆస్పత్రిలో చికిత్స పొందుతూ ఇవాళ మరణించారు. ఆయన నటుడిగానే కాకుండా ‘వీర మదకరి’, ‘చంద్రముఖి ప్రాణసఖి’, ‘రాక్షస’ తదితర చిత్రాలతో ఆర్ట్ డైరెక్టర్గానూ గు...
ప్రముఖ నటి తమన్నా నటించిన కొత్త వెబ్సిరీస్ ‘డు యూ వనా పార్ట్నర్’. నిషాంత్ నాయక్, గంగోపాధ్యాయ తెరకెక్కించారు. ప్రముఖ ఓటీటీ ‘అమెజాన్ ప్రైమ్ వీడియో’ రూపొందించింది. తాజాగా, విడుదల తేదీ ఖరారైంది. సెప్టెంబర్ 12 నుంచి స్ట్రీమింగ్ కానుంది. ఈ కామెడీ, డ్రామా వెబ్సిరీస్లో బాలీవుడ్ నటి డయానా పెంటీ మరో కీలకపాత్ర పోషించారు.
నటుడు, నిర్మాత బండ్ల గణేష్ ఇంట్లో తాజాగా జరిగిన ప్రత్యేక పార్టీకి టాలీవుడ్కు చెందిన పలు ప్రముఖులు హాజరై సందడి చేశారు. ఈ వేడుకకు సంబంధించిన ఫొటోలను నటుడు బ్రహ్మాజీ తన SM ఖాతాలో షేర్ చేశారు. ’30 ఇయర్స్ ఇండస్ట్రీ. పార్టీకి థ్యాంక్యూ బండ్ల గణేష్ బ్రో. యంగ్ అండ్ డైనమిక్ డైరెక్టర్స్తో.. సీనియర్ సిటిజన్స్.. కాదు కాదు, సీనియర్ యాక్టర్స్’ అని ఫన్నీ క్యాప్షన్ ఇచ్చారు.
పవర్ స్టార్ పవన్ కళ్యాణ్, ప్రియాంక మోహన్ జంటగా నటించిన సినిమా ‘OG’. తాజాగా ఈ మూవీ నుంచి సెకండ్ సింగిల్ రాబోతుంది. ‘సువ్వి సువ్వి’ అంటూ సాగే ఈ పాట వినాయక చవితి కానుకగా ఈ నెల 27న ఉదయం 10:08 గంటలకు విడుదల కానుంది. ఇక దర్శకుడు సుజీత్ తెరకెక్కించిన ఈ సినిమా సెప్టెంబర్ 25న రిలీజ్ కాబోతుంది.
తమిళ హీరో విజయ్ సేతుపతి, నిత్య మీనన్ జంటగా నటించిన మూవీ ‘తలైవన్ తలైవి’. తెలుగులో ‘సార్ మేడమ్’ పేరుతో విడుదలైంది. తాజాగా ఈ సినిమా ప్రపంచవ్యాప్తంగా రూ.100 కోట్ల కలెక్షన్స్ సాధించినట్లు మేకర్స్ ప్రకటించారు. ఈ మేరకు పోస్టర్ షేర్ చేశారు. దర్శకుడు పాండిరాజ్ తెరకెక్కించిన ఈ మూవీ ప్రస్తుతం అమెజాన్ ప్రైమ్లో పాన్ ఇండియా భాషల్లో స్ట్రీమింగ్ అవుతోంది.
హాలీవుడ్లో విషాదం నెలకొంది. నెట్ఫ్లిక్స్ సిరీస్ ‘ఎమిలీ ఇన్ పారిస్’ అసిస్టెంట్ డైరెక్టర్ డియాగో బొరెల్లా కన్నుమూశారు. ఈ సిరీస్ షూటింగ్లో ఆయన ఒక్కసారిగా కుప్పకూలారు. వెంటనే సెట్లో ఉన్న వైద్య సిబ్బంది.. ఆయన ప్రాణాలు రక్షించేందుకు ప్రయత్నించినా ఫలితం లేకుండా పోయింది. అప్పటికే ఆయన మరణించారు. అయితే గుండెపోటు కారణంగా ఆయన చనిపోయినట్లు తెలుస్తోంది.
నందమూరి బాలకృష్ణకు అరుదైన గౌరవం లభించింది. సినీ పరిశ్రమలో 50 ఏళ్లుగా ప్రేక్షకులను అలరించడం, బసవతారకం ఆస్పత్రి ద్వారా ఆయన చేస్తున్న సేవలకుగానూ UKలోని వరల్డ్ బుక్ ఆఫ్ రికార్డ్స్ గోల్డ్ ఎడిషన్ గుర్తింపును ఇచ్చింది. దీంతో ఇండియన్ సినీ చరిత్రలో ఈ ఘనత సాధించిన ఏకైక హీరోగా బాలయ్య నిలిచారు. ఈ నెల 30న హైదరాబాద్లో జరగనున్న కార్యక్రమంలో బాలయ్యను సత్కరించనున్నారు.
సౌత్ ఇండస్ట్రీపై బాలీవుడ్ నటి డైసీ షా సంచలన వ్యాఖ్యలు చేశారు. బాలీవుడ్ కంటే సౌత్లో బొడ్డు, నడుమును ఎక్కువగా చూపిస్తారని తెలిపారు. హీరోయిన్ల నడుము, పొట్టపై కెమెరా క్లోజప్ షాట్లు ఎక్కువగా పెట్టడం అన్ని ఇండస్ట్రీలో సాధారణమేనని, కానీ సౌత్లో అవి చాలా ఎక్కువగా ఉంటాయని వెల్లడించారు. ఈ వ్యాఖ్యలపై నెటిజన్ల నుంచి భిన్నాభిప్రాయాలు వ్యక్తం అవుతున్నాయి.