తమిళ హీరో విశాల్, దర్శకుడు రవి అరసు కాంబోలో తెరకెక్కుతోన్న సినిమా మగుడం’. తెలుగులో ‘మకుటం’ పేరుతో విడుదల కానుంది. ఈ మూవీ నుంచి రిలీజైన ఫస్ట్ లుక్ పోస్టర్ ఆకట్టుకుంటోంది. ఈ పోస్టర్లో విశాల్ మూడు విభిన్న గెటప్లో కనిపించి సినిమాపై క్యూరియాసిటీ పెంచేశారు. ఇక ఈ సినిమాలో అంజలి, దుషార విజయన్ కీలక పాత్రల్లో నటిస్తుండగా.. GV ప్రకాష్ మ్యూజిక్ అందిస్తున్నారు.
మలయాళ నటి లక్ష్మి మీనన్కు కేరళ కోర్టులో ఊరట లభించింది. IT ఉద్యోగినిపై దాడి కేసులో లక్ష్మితో పాటు తన ముగ్గురు ఫ్రెండ్స్పై కేసు నమోదైన విషయం తెలిసిందే. ఈ కేసులో ముందస్తు బెయిల్ కోసం నటి కోర్టును ఆశ్రయించారు. దీంతో న్యాయస్థానం సెప్టెంబర్ 17 వరకు ఆమెను అరెస్ట్ చేయకండి అని పోలీసులకు ఆదేశాలు జారీ చేసింది. అయితే ఆమె ఫ్రెండ్స్ను పోలీసులు అరెస్ట్ చేశారు.
నందమూరి బాలకృష్ణతో దర్శకుడు బోయపాటి శ్రీను తెరకెక్కిస్తోన్న మూవీ ‘అఖండ 2’. సెప్టెంబర్ 25న రిలీజ్ కానున్న ఈ సినిమా వాయిదా పడే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది. ఈ మూవీ అప్డేట్స్ రాకపోవడం, ఇటీవల నందమూరి ఇంట విషాదం నెలకొన్న నేపథ్యంలో ఈ చిత్రాన్ని వాయిదా వేయనున్నారట. అయితే డిసెంబర్ 4న లేదా ఆ తర్వాతి తేదీల్లో దీన్ని విడుదల చేయాలని మేకర్స్ ప్లాన్ చేస్తున్నట్లు సమాచారం.
‘బాహుబలి:ది ఎపిక్’ మూవీపై దర్శకుడు రాజమౌళి ఆసక్తికర విషయాలు పంచుకున్నారు. ఈ మూవీ విషయంలో అన్నిటికంటే కష్టమైన పని ఎడిటింగ్ అని తెలిపారు. ‘బాహుబలి 1, 2’ కలిపి 5:27 నిమిషాల నిడివి ఉన్నాయని, నిడివి తగ్గించడానికి కొన్ని సన్నివేశాలు తొలగించామని పేర్కొన్నారు. ఇందులో భాగంగా ‘కన్నా నిదురించరా’ పాటతో పాటు ప్రభాస్, తమన్నా మధ్య వచ్చే కొన్ని రొమాంటిక్ సన్నివేశాలను కట్ చేస...
దర్శకుడు గోపీచంద్ మలినేనితో నందమూరి బాలకృష్ణ ఓ సినిమా చేయనున్నారు. ‘NBK111’ వర్కింగ్ టైటిల్తో రాబోతున్న ఈ సినిమాను అక్టోబర్ 2న గ్రాండ్గా లాంచ్ చేయనున్నట్లు తెలుస్తోంది. దసరా తర్వాత నుంచి దీని రెగ్యులర్ షూటింగ్ స్టార్ట్ కానుందట. ఇక తమన్ మ్యూజిక్ అందించనున్న ఈ చిత్రాన్ని 2026 దసరా కానుకగా రిలీజ్ చేయాలని మేకర్స్ ప్లాన్ చేస్తున్నట్లు సమాచారం.
కేరళ కొచ్చిలో IT ఉద్యోగిని కిడ్నాప్ కేసులో తమిళ హీరోయిన్ లక్ష్మి మీనన్తో పాటు మరో ముగ్గురిపై ఎర్నాకులం నార్త్ పోలీసులు కేసు నమోదు చేశారు. ఆదివారం రాత్రి ఓ రెస్టారెంట్ వద్ద జరిగిన వాగ్వాదం తర్వాత లక్ష్మి మీనన్ గ్యాంగ్ బాధితుడిని వెంబడించి.. కారులో లాక్కొని దాడి చేసిందని పోలీసులకు ఫిర్యాదు అందింది. లక్ష్మి పరారీలో ఉండగా.. మిథున్, అనీష్, సోనామోల్ అరెస్ట్ అయ్యారు.
మెగాస్టార్ చిరంజీవి హీరోగా అనిల్ రావిపూడి దర్శకత్వంలో మన శంకరవరప్రసాద్ గారు.. పండగకి వస్తున్నారు’ సినిమా రాబోతుంది. ఇవాళ వినాయక చవితి సందర్భంగా ఈ మూవీ నుంచి క్రేజీ పోస్టర్ విడుదలైంది. ఇందులో పడవపై చిరు పంచకట్టులో అదరగొట్టారు. ఇక నయనతార కథానాయికగా నటిస్తోన్న ఈ మూవీ 2026 సంక్రాంతికి రిలీజ్ కానుంది.
30 ఏళ్లు దాటినా అమ్మాయిల్లో తనకు నచ్చిన ఐదు లక్షణాలు లేవంటూ రిజెక్ట్ చేస్తున్న సిద్ధార్థ్(నారా రోహిత్)కు చివరికి పెళ్లి జరిగిందా? లేదా? అనేది ఈ మూవీ కథ. కామెడీ బాగుంది. ఫస్టాఫ్, ఓ చోట ట్విస్ట్ మూవీకి ప్లస్. ఊహించే సన్నివేశాలు మైనస్. రేటింగ్ 2.5/5.
‘పరమ్ సుందరి’ సినిమాతో ‘చెన్నై ఎక్స్ప్రెస్’ మూవీని పోల్చడంపై నటి జాన్వీ కపూర్ స్పందించారు. అలాంటి ఐకాన్ సినిమాతో ‘పరమ్ సుందరి’ మూవీని పోల్చడం ఆనందంగా ఉందన్నారు. కానీ ఈ రెండు సినిమాలకు పోలిక ఉండదని, అయినా ప్రేక్షకులు దీన్ని అంత గొప్ప సినిమాతో పోలుస్తున్నందుకు గౌరవంగా ఉందని పేర్కొన్నారు.
ప్రముఖ నటుడు, తమిళిగ వెట్రి కళగం(TVK) పార్టీ అధినేత విజయ్పై కేసు నమోదైంది. మధురైలో జరిగిన టీవీకే పార్టీ కార్యక్రమంలో తనపై దాడి జరిగిందని శరత్కుమార్ అనే వ్యక్తి ఫిర్యాదు చేశారు. నటుడిని కలిసేందుకు వెళ్తుండగా అడ్డుకున్న బౌన్సర్లు తనపై దాడికి పాల్పడ్డారని బాధితుడు ఆరోపించారు. దీంతో పోలీసులు విజయ్, ఆయన బౌన్సర్లపై కేసు నమోదు చేశారు.
నటుడు కిచ్చాసుదీప్ అభిమానులకు కీలక విజ్ఞప్తి చేశాడు. సెప్టెంబర్ 2న తన పుట్టినరోజు సందర్భంగా తన ఇంటిముందుకు వచ్చి హంగామా చేయవద్దని హెచ్చరించాడు. ఈ మేరకు ట్విట్టర్ ద్వారా ‘ప్రియమైన మిత్రులారా సెప్టెంబర్ 2 ఉదయం కాదు రాత్రి 1 గంటలకు కలుద్దాం. సెప్టెంబర్ 2న మీరు నన్ను కలవడానికి ఎంతగానో వేచి ఉంటారో దానికంటే ఎక్కువగా నేను మీకోసం ఎదురు చూస్తాను’ అని రాసుకోచ్చాడు.
VSP: కబడ్డీ క్రీడాకారుడి జీవితం ఆధారంగా తెరకెక్కిన ‘అర్జున్ చక్రవర్తి’ చిత్రం ఈ నెల 29న విడుదల కానుంది. ఈ సందర్భంగా విశాఖలో మంగళవారం ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో చిత్ర బృందం పాల్గొంది. హీరో విజయ రామరాజు మాట్లాడుతూ.. ఇది ఒక కబడ్డీ ఛాంపియన్ నిజ జీవిత కథ ఆధారంగా రూపొందించిన చిత్రమని తెలిపారు.
మలయాళ మెగాస్టార్ మమ్ముట్టి, దర్శకుడు జితిన్ కె జోస్ కాంబోలో తెరకెక్కిన చిత్రం ‘కలమ్ కవల్’ టీజర్ రాబోతున్నట్లు వెల్లడించారు. ఈ నెల 28న ఓనమ్ సందర్భంగా టీజర్ విడుదల చేయనున్నట్లు చిత్రయూనిట్ వెల్లడించింది. ఈ మూవీలో వినాయకన్ విలన్గా నటిస్తున్నాడు. ఈ చిత్రాన్ని మమ్ముట్టి సొంత బ్యానర్లో స్వయంగా ఆయనే నిర్మిస్తున్నారు.
మాస్ మహారాజ రవితేజ నటిస్తున్న లేటెస్ట్ మూవీ ‘మాస్ జాతర’. శ్రీలీల హీరోయిన్గా నటిస్తోంది. ఆగస్టు 27న రిలీజ్ చేయనున్నట్లు చిత్ర యూనిట్ మొదట ప్రకటించింది. అయితే, అనుకోని కారణాల వల్ల వాయిదా వేస్తున్నట్లు ‘X’ వేదికగా అధికారికంగా తెలిపింది. షూటింగ్ పూర్తయ్యాక భారీ స్థాయిలో థియేటర్లలో విడుదల చేస్తామని పేర్కొంది. అతి త్వరలోనే కొత్త తేదీని ప్రకటిస్తామని వెల్లడించింది.
హీరో తేజా సజ్జా ప్రధాన పాత్రలో నటిస్తున్న చిత్రం ‘మిరాయ్’. పలు మార్లు వాయిదా పడుతూ వస్తున్న ఈ మూవీని సెప్టెంబర్ 12 రిలీజ్ చేస్తున్నట్లు మేకర్స్ అధికారికంగా ప్రకటించారు. ఈ మేరకు తేజా సజ్జా ఓ పోస్టర్ను విడుదల చేశారు. అలాగే ఈ నెల 28న ట్రైలర్ను లాంచ్ చేయనున్నట్లు తెలిపారు. కార్తీక్ ఘట్టమనేని తెరకెక్కిస్తున్న ఈ సినిమాలో మంచు మనోజ్ విలన్గా నటిస్తున్నారు.