సత్యదేవ్ హీరోగా వెంకటేష్ మహా దర్శకత్వంలో వస్తున్న చిత్రం ‘రావు బహదూర్’. సైకలాజికల్ డ్రామాగా తెరకెక్కుతున్న ఈ చిత్రాన్ని సూపర్స్టార్ మహేష్ బాబు సమర్పిస్తున్నారు. వృద్ధుడి గెటప్లో సత్యదేవ్ మేకోవర్, టీజర్ ఇప్పటికే ఆకట్టుకున్నాయి. ఈ సినిమా మేలో విడుదల కానుందని సత్యదేవ్ స్వయంగా వెల్లడించారు. త్వరలోనే అధికారిక రిలీజ్ డేట్ను చిత్ర బృందం ప్రకటించనుంది.
‘PS 2’లోని ‘వీర రాజా వీర’ సాంగ్కు డగర్ బ్రదర్స్కు క్రెడిట్ ఇవ్వడానికి AR రెహమాన్ సుప్రీంకోర్టులో అంగీకరించాడు. 5వారాల్లోపు SM, OTTలలో సవరించిన క్రెడిట్లు కనిపించాలని కోర్టు ఆదేశించింది. ‘శివస్తుతి’ నుంచి ఈ పాటను కాపీ చేశారని డగర్ గతంలో ఫిర్యాదు చేశారు. దీంతో డగర్వాణీ ధ్రుపద్ సంప్రదాయం పేరుతో క్రెడిట్స్ ఇచ్చేందుకు రెహమాన్ ఓకే చెప్పాడు.
స్టార్ మా: రాజా ది గ్రేట్(9AM); జీతెలుగు: రౌడీ బాయ్స్(9AM); ఈటీవీ: సందడే సందడి(9AM); స్టార్మా మూవీస్: సప్తగిరి LLB(7AM), వినయ విధేయ రామ(9AM), వీర సింహారెడ్డి(12PM), పోకిరి(3PM), K-ర్యాంప్(6PM), సలార్(9PM); జీ సినిమాలు: కొంచెం ఇష్టం కొంచెం కష్టం(7AM), విన్నర్(9AM), ఆర్యన్(12PM).
విశ్వక్ సేన్ ‘ఓరి దేవుడా’ సినిమాతో మిథిలా పాల్కర్ మంచి గుర్తింపు తెచ్చుకుంది. ఇప్పుడు ఆమె ఏకంగా బాలీవుడ్ స్టార్ హీరో అక్షయ్ కుమార్తో ‘భూత్ బంగ్లా’లో నటించే చాన్స్ కొట్టేసింది. ఈ చిత్రంలో ఆమె తన చెల్లెలి పాత్రలో కనిపిస్తుందని అక్షయ్ తెలిపాడు. ప్రియదర్శన్ దర్శకత్వం వహిస్తున్నాడు. ఈ చిత్రం మే 15న గ్రాండ్గా విడుదల కానుంది.
‘కపుల్ ఫ్రెండ్లీ’ మూవీ ప్రమోషన్స్లో భాగంగా జరిగిన ఇంటర్వ్యూలో రెబల్ స్టార్ ప్రభాస్ పాల్గొన్నాడు. ఈ సందర్భంగా విజయవాడలో దొరికే పునుగులు తన ఆల్టైమ్ ఫేవరెట్ అని ప్రభాస్ తెలిపాడు. చిన్నప్పుడు సమ్మర్ హాలిడేస్లో ఫ్రెండ్స్తో కలిసి పునుగులు తినేవాడినని పేర్కొన్నాడు. అయితే, ఇప్పుడు బిజీగా ఉండటం వల్ల తినడం కుదరడం లేదని వ్యాఖ్యానించాడు.
బాబీ డియోల్ హీరోగా, అనురాగ్ కశ్యప్ దర్శకత్వంలో తెరకెక్కిన చిత్రం ‘బందర్’. ఈ సినిమాను సమ్మర్ స్పెషల్గా ఈ ఏడాది మే 22న విడుదల చేయనున్నారు. ఈ విషయాన్ని మేకర్స్ అధికారికంగా ప్రకటించారు. ఇందుకు సంబంధించిన ఓ పోస్టర్ను విడుదల చేస్తూ.. ‘మే 22న థియేటర్లలో కలుద్దాం’ అని పేర్కొన్నారు. ఈ సినిమాలో సన్యా మల్హోత్రా, రాజ్ బి శెట్టి కీలక పాత్రల్లో కనిపించబోతున్నారు.
ప్రపంచంలోనే అతిపెద్ద కంపెనీగా అమెజాన్ అవతరించిందని బ్లూమ్బెర్గ్ వెల్లడించింది. 2025 ఆర్థిక సంవత్సరంలో అమెజాన్ $717 బిలియన్ల అమ్మకాలు జరపగా, వాల్మార్ట్ $713.2 బిలియన్ల వద్ద నిలిచింది. గత దశాబ్దంలో వాల్మార్ట్ కంటే 10 రెట్లు వేగంగా ఆదాయాన్ని వృద్ధి చేసుకున్న అమెజాన్, రిటైల్ మార్కెట్లో తన తిరుగులేని ఆధిపత్యాన్ని చాటుకుంది.
‘పుష్ప-2’ సంధ్య థియేటర్ తొక్కిసలాట ఘటనలో కీలక పరిణామం చోటుచేసుకుంది. అల్లు అర్జున్ సహా 23 మందిపై అభియోగాలు నమోదు చేస్తూ పోలీసులు దాఖలు చేసిన ఛార్జ్షీట్ను నాంపల్లి కోర్టు తిప్పి పంపింది. ఆ ఛార్జ్షీట్లో పలు లోపాలు ఉన్నట్లు గుర్తించిన కోర్టు.. హార్డ్ డిస్క్లు, సీడీలు, పెన్ డ్రైవ్ల వంటి సాంకేతిక ఆధారాలను జతపరచకపోవడంతో ఈ నిర్ణయం తీసుకుంది.
ప్రముఖ నటి మీనాక్షి చౌదరి బాలీవుడ్ సినిమాకు ఓకే చెప్పినట్లు తెలుస్తోంది. అక్షయ్ కుమార్, గోవిందా, పరేష్ రావల్ కాంబోలో వచ్చిన బ్లాక్ బస్టర్ మూవీ ‘భాగమ్ భాగ్’కు సీక్వెల్ రాబోతుంది. ఈ సినిమాలో మీనాక్షితో పాటు నటుడు మనోజ్ బాజ్పాయ్ కీలక పాత్రల్లో కనిపించనున్నట్లు సమాచారం. పక్కా కామెడీ ఎంటర్టైనర్గా రాబోతున్న ఈ సినిమాకు రాజ్ శాండిల్య దర్శకత్వం వహించనున్నాడు.
బిట్కాయిన్ మోసం కేసులో బాలీవుడ్ నటి శిల్పాశెట్టి భర్త, వ్యాపారవేత్త రాజ్కుంద్రాకు ఊరట లభించింది. ఆయనకు ముంబైలోని PMLA కోర్టు బెయిల్ మంజూరు చేసింది. భారీ స్థాయిలో క్రిప్టో కరెన్సీ మోసానికి పాల్పడ్డారనే ఆరోపణలతో ఆయనపై కేసు నమోదైన విషయం తెలిసిందే. ఇవాళ ఈ కేసుపై విచారణ జరిపిన కోర్టు.. ఇరుపక్షాల వాదనలు విన్న అనంతరం ఈ విధంగా తీర్పునిచ్చింది.
‘ఆంధ్ర కింగ్ తాలూకా’ సినిమా తర్వాత ఎనర్జిటిక్ హీరో రామ్ పోతినేని తన తదుపరి ప్రాజెక్టుపై ఫోకస్ పెట్టినట్లు తెలుస్తోంది. దర్శకుడు కిషోర్ తిరుమల వద్ద ఒక కథను తీసుకున్న రామ్.. మరో కథను కూడా అభివృద్ధి చేస్తున్నాడట. రైటింగ్ టీంతో కలిసి స్వయంగా కథా చర్చల్లో పాల్గొంటున్నట్లు సమాచారం. సొంత బ్యానర్పై కొత్త దర్శకుడితో సినిమాను నిర్మించే ఆలోచనలో రామ్ ఉన్నట్లు తెలుస్తోంది.
ఎన్టీఆర్, ప్రశాంత్ నీల్ క్రేజీ కాంబో మూవీ టైటిల్పై ఉత్కంఠ నెలకొంది. మొదట ఈ మూవీకి ‘డ్రాగన్’ అనే పేరు పెట్టినట్లు వార్తలు వినిపించగా.. తాజాగా ‘బ్రూస్లీ’ అనే టైటిల్ను ఖరారు చేశారట. అయితే, గతంలో రామ్ చరణ్ ‘బ్రూస్లీ’ మూవీ ఆశించిన విజయం సాధించకపోవడంతో ఫ్యాన్స్ ఆందోళన చెందుతున్నారు. కానీ, పాన్ ఇండియా స్థాయిలో ఈ పేరు ప్లస్ అవుతుందని మేకర్స్ భావిస్తున్నట్...
తమిళ హీరో విక్రమ్, ఆయన తనయుడు ధృవ్ విక్రమ్ కలిసి నటించిన మూవీ ‘మహాన్’. దర్శకుడు కార్తీక్ సుబ్బరాజు తెరకెక్కించిన ఈ సినిమా OTTలో రిలీజై మంచి హిట్ అందుకుంది. తాజాగా ఈ సినిమా సీక్వెల్పై దర్శకుడు కార్తీక్ మాట్లాడుతూ.. ఈ సీక్వెల్ కోసం తన దగ్గర ఐడియా ఉందన్నాడు. కానీ స్క్రిప్ట్ ఇంకా ప్రారంభ దశలో ఉందని, 2027-28 నాటికి ఇది విడుదలయ్యే ఛాన్స్ ఉందని చెప్పాడు.
‘ఎల్లమ్మ’ మూవీతో మ్యూజిక్ డైరెక్టర్ దేవిశ్రీ ప్రసాద్ హీరోగా వెండితెరకు పరిచయం కాబోతున్నాడు. తాజాగా ఈ మూవీపై DSP ఆసక్తికర వ్యాఖ్యలు చేశాడు. సంగీత దర్శకుడిగా అత్యంత బిజీగా ఉన్నప్పటికీ.. ఈ మూవీ కోసం నెలలో కేవలం 10 రోజులు పనిచేస్తానని చెప్పాడు. అందుకోసం నిర్మాత దిల్ రాజుతో ప్రత్యేక ఒప్పందం కుదర్చుకున్నట్లు తెలిపాడు. ఇక ‘బలగం’ ఫేమ్ వేణు యెల్దండి ఈ మూవీని తెరకెక్కిస్తున్నాడు.
అభిమానుల కోసం ఏడాదికి 3-4 మూవీలు చేస్తున్నా, ఒక్కటే విడుదలవుతోందని ప్రభాస్ అన్నాడు. ‘కపుల్ ఫ్రెండ్లీ’ చిత్రబృందంతో ముచ్చటించిన ఆయన.. తనకు అన్ని జానర్లు ఇష్టమని, ముఖ్యంగా మణిరత్నం అంటే ప్రత్యేకమైన అభిమానమని తెలిపాడు. ‘గీతాంజలి’ అంటే తనకెంతో ఇష్టమని, ‘కపుల్ ఫ్రెండ్లీ’ చూసినప్పుడు ఆ మూవీ ఫీల్ కలిగిందన్నాడు. అందుకే దీన్ని నాలుగు సార్లు చూడాలని నిర్ణయించుకున్నానని...