‘కపుల్ ఫ్రెండ్లీ’ చిత్రబృందంతో ముచ్చటించిన ప్రభాస్ ఆసక్తికర విషయాలు పంచుకున్నాడు. తాను అప్పుడప్పుడు వేరే రాష్ట్రాల నుంచి ఫుడ్ ఆర్డర్ పెడతానని చెప్పాడు. ‘ఆదిపురుష్’ షూటింగ్ ముంబైలో జరుగుతున్నప్పుడు చెన్నై నుంచి ఫుడ్ ఆర్డర్ చేశానని, టీం అంతా షాక్ అయిందని అన్నాడు. ఫ్లైట్లో ఆర్డర్ తీసుకొచ్చిన వ్యక్తి ‘మీరు మాములు వాళ్లు కాదండి అన్నాడు’ అని చెప్పాడు.
‘కల్కి’ దర్శకుడు నాగ్ అశ్విన్.. ఇప్పుడు మెగాస్టార్ చిరంజీవి కోసం ఒక భారీ కథను సిద్ధం చేశాడట. ఇది ‘జగదేక వీరుడు అతిలోక సుందరి’కి సీక్వెల్ లేదా పక్కా మైథలాజికల్ డ్రామా అని టాక్ నడుస్తోంది. వైజయంతీ మూవీస్ నిర్మించనున్న ఈ క్రేజీ ప్రాజెక్టుకు చిరు గ్రీన్ సిగ్నల్ ఇస్తే, తెలుగు సినిమాలో మరో అద్భుత దృశ్యకావ్యం ఖాయమని సినీ వర్గాలు పేర్కొన్నాయి. త్వరలోనే దీనిపై క్లారిటీ రానుంది.
‘కల్కి 2’ కోసం ఎదురుచూస్తున్న అభిమానులకు క్రేజీ అప్డేట్ వచ్చింది. ‘కల్కి 2’ షూటింగ్ హైదరాబాద్లో అట్టహాసంగా ప్రారంభమైనట్లు తెలుస్తోంది. బిగ్ బి అమితాబ్ బచ్చన్ ఇప్పటికే సెట్స్లో అడుగుపెట్టగా.. ఆయనకు సంబంధించిన కీలక సన్నివేశాలను మేకర్స్ చిత్రీకరిస్తున్నట్లు సమాచారం. త్వరలోనే ప్రభాస్, సాయి పల్లవి కూడా ఈ షూటింగ్లో జాయిన్ కానున్నట్లు టాక్.
ఓ విభిన్నమైన మిస్టిక్ థ్రిల్లర్ కథతో నందమూరి కళ్యాణ్ రామ్ రాబోతున్నట్లు తెలుస్తోంది. ప్రముఖ రచయిత శ్రీకాంత్ విస్సా ఈ మూవీతో దర్శకుడిగా పరిచయం కాబోతున్నాడట. ఇప్పటికే కథా చర్చలు పూర్తి కాగా.. ప్రస్తుతం ప్రీ-ప్రొడక్షన్ పనులు శరవేగంగా జరుగుతున్నట్లు టాక్. భారీ బడ్జెట్తో తెరకెక్కనున్న ఈ మూవీని త్వరలోనే పట్టాలెక్కించేందుకు మేకర్స్ ప్లాన్ చేస్తున్నారట.
‘కపుల్ ఫ్రెండ్లీ’ చిత్రబృందంతో ముచ్చటించిన ప్రభాస్ ప్రేమపై ఆసక్తికర వ్యాఖ్యలు చేశాడు. ఈ సందర్భంగా నటి మానస వారణాసి ‘ప్రేమపై మీ అభిప్రాయం ఏంటి?’ అని అడగ్గా.. ప్రభాస్ సిగ్గుపడుతూ సమాధానమిచ్చాడు. ‘నాకు కూడా ప్రేమలో పడాలని ఉంది. ఆ అద్భుతమైన ఫీలింగ్ను అనుభవించాలని ఆతృతగా ఎదురుచూస్తున్నాను’ అని మనసులో మాట బయటపెట్టాడు. ప్రభాస్ చేసిన ఈ వ్యాఖ్యలు నెట్టింట వైరలవు...
సంతోష్ శోభన్ నటించిన ‘కపుల్ ఫ్రెండ్లీ’ మూవీకి ప్రేక్షకుల నుంచి మంచి ఆదరణ లభిస్తోంది. తాజాగా ఈ చిత్రాన్ని చూసిన రెబెల్ స్టార్ ప్రభాస్, చిత్ర బృందాన్ని కలిసి ప్రత్యేకంగా అభినందించాడు. ఈ నేపథ్యంలో ప్రభాస్ను కలిసిన సంతోష్ శోభన్ ఆ ఫొటోను SMలో షేర్ చేస్తూ.. మొదటి నుంచి తనకు అండగా నిలుస్తున్నందుకు డార్లింగ్కు కృతజ్ఞతలు తెలిపాడు.
హీరోయిన్ అనుపమ పరమేశ్వరన్, ధ్రువ్ విక్రమ్ డేటింగ్లో ఉన్నట్లు జోరుగా ప్రచారం జరుగుతోంది. తాజాగా ఓ అవార్డు వేడుకలో వీరిద్దరూ దిగిన సెల్ఫీని ధ్రువ్ ఇన్స్టాలో షేర్ చేయగా, అనుపమ దానికి ‘లవ్ సింబల్’ జోడించి రీషేర్ చేయడం చర్చకు దారితీసింది. గతంలోనూ రాత్రివేళ ఫోన్ చేయాల్సి వస్తే ధ్రువ్కే చేస్తానని ఆమె అనడం విశేషం. వీరిద్దరూ కలిసి ‘బైసన్’ చిత్రంలో నటించారు.
మెగాస్టార్ చిరంజీవి నటించిన బ్లాక్బస్టర్ మూవీ ‘మన శంకరవర ప్రసాద్ గారు’ OTTలోనూ రికార్డుల వేట కొనసాగిస్తోంది. అనిల్ రావిపూడి తెరకెక్కించిన ఈ చిత్రం థియేటర్లలోనే కాదు OTTలో కూడా అదరగుడుతోంది. FEB 11న జీ5లో స్ట్రీమింగ్కు వచ్చిన ఈ మూవీ తాజాగా 500 మిలియన్ల స్ట్రీమింగ్ మినిట్స్ సాధించి సరికొత్త రికార్డు సృష్టించింది.
అక్కినేని నాగచైతన్య, దర్శకుడు కార్తీక్ దండు కాంబోలో ‘వృషకర్మ’ సినిమా తెరకెక్కుతోంది. ప్రస్తుతం ఈ మూవీ షూటింగ్ రామోజీ ఫిల్మ్ సిటీలో జరుగుతోంది. అయితే మార్చి తొలివారంలో ఈ సినిమా నుంచి స్పెషల్ గ్లింప్స్ను రిలీజ్ చేయాలని మేకర్స్ ప్లాన్ చేస్తున్నారట. ఇప్పటికే అందుకు సంబంధించిన పనులు స్టార్ట్ చేశారట. కాగా, దీనిపై క్లారిటీ రావాల్సి ఉంది.
బాలీవుడ్ హీరో రణ్వీర్ సింగ్కు లారెన్స్ బిష్ణోయ్ గ్యాంగ్ నుంచి వరుస బెదిరింపులు రావడం కలకలం రేపుతోంది. తాజాగా ఆ ముఠాకు చెందిన వ్యక్తి రూ.10 కోట్లు డిమాండ్ చేస్తూ అతన్ని బెదిరించినట్లు తెలుస్తోంది. US నంబర్ నుంచి వాయిస్ నోట్ పంపినట్లు సమాచారం. దీనిపై ముంబై పోలీసులు విచారణ చేపట్టి, US ఏజెన్సీల సాయంతో నిందితుడిని గుర్తించే పనిలో ఉన్నారని మీడియా వర్గాలు తెలిపాయి.
భారీ విజయం అందుకున్న ‘సైయారా’ మూవీ దర్శకుడు మోహిత్ సూరితో రణ్బీర్ కపూర్ సినిమా చేయనున్నట్లు తెలుస్తోంది. మోహిత్ ఓ గ్యాంగ్స్టర్ మ్యూజికల్ లవ్స్టోరీని తెరకెక్కించడానికి ప్లాన్ చేస్తున్నాడట. ఇందులో రణ్బీర్ హీరోగా నటించనుండగా.. ఈ చిత్రాన్ని ఆదిత్య చోప్రా నిర్మించనున్నట్లు సమాచారం. ప్రస్తుతం కథ చర్చలు జరుగుతున్నట్లు టాక్.
హాలీవుడ్ నటుడు ఎరిక్ డేన్ (53) Amyotrophic Lateral Sclerosis (ALS) వ్యాధితో కన్నుమూశాడు. ‘Grey’s Anatomy’, ‘Euphoria’ వంటి సిరీస్లతో పాటు ‘X-Men’, ‘Bad Boys’ సినిమాలతో ఆయన గుర్తింపు పొందాడు. కండరాల బలహీనత, శ్వాస తీసుకోవడంలో ఇబ్బందులు కలిగించే ఈ ప్రాణాంతక వ్యాధి రావడానికి కచ్చితమైన కారణం లేదు. అభిమానులు తమ అభిమాన నటుడికి నివాళులర్పిస్తు...
హర్రర్ థ్రిల్లర్ కథాంశంతో తెరకెక్కిన ‘ఈషా’ మూవీ OTTలోకి వచ్చేసింది. గత ఏడాది DEC 25న విడుదలై ఈ సినిమా అమెజాన్ ప్రైమ్లో స్ట్రీమింగ్ అవుతోంది. అయితే ఈ మూవీ కేవలం ఓవర్సీస్లో రెంట్ పద్దతిలో మాత్రమే అందుబాటులో ఉండేది. తాజాగా తెలుగులో కూడా స్ట్రీమింగ్కు వచ్చేసింది. ఇక ఈ మూవీలో హెబ్బా పటేల్, త్రిగుణ్, అఖిల్ రాజ్, సిరి హన్మంత్ కీలక పాత్రలు పోషించారు.
దర్శకధీరుడు రాజమౌళి ‘వారణాసి’ చిత్రాన్ని హాలీవుడ్ రేంజ్లో తెరకెక్కిస్తున్నాడు. రూ. 1300 కోట్లకు పైగా బడ్జెట్తో సూపర్ స్టార్ మహేష్ బాబు, ప్రియాంక చోప్రా ప్రధాన పాత్రల్లో ఈ చిత్రం రూపొందుతోంది. అయితే, ఈ సినిమాలో కన్నడ స్టార్ కిచ్చా సుదీప్ కీలక పాత్రలో కనిపించనున్నాడని సమాచారం. కాగా దీనిపై అధికారిక ప్రకటన రావాల్సి ఉంది.
పాన్ ఇండియా స్టార్ ప్రభాస్ కొత్త లుక్లో కనిపించాడు. కొత్త హెయిర్ స్టైల్, గడ్డం, ట్రెండీ డ్రెస్సింగ్లో సందడి చేశాడు. మిర్చి సినిమాలో ఉన్నట్లుగానే కనిపిస్తున్న ఈ ఫొటోలు సోషల్ మీడియాలో వైరల్గా మారాయి. దీంతో ప్రభాస్ కొత్త లుక్స్ అదిరిపోయాయని నెటిజన్లు కామెంట్స్ చేస్తున్నారు. కాగా, హను రాఘవపూడి దర్శకత్వంలో వస్తున్న ‘ఫౌజీ’ కోసమే ఈ స్టైల్ అని టాక్ వినిపిస్తోంది.