అంతర్జాతీయ వేదికగా మణిపురీ సినిమా ‘బూంగ్’కు బాఫ్టా అవార్డు దక్కింది. బెస్ట్ చిల్డ్రన్స్- ఫ్యామిలీ ఫిల్మ్ కేటగిరీలో పురస్కారం లభించింది. ఇది ఈశాన్య భారత సినిమాకు దక్కిన అరుదైన గౌరవం. బూంగ్ చిత్రానికి లక్ష్మీప్రియా దేవి దర్శకత్వం వహించారు. మణిపూర్లోని సరిహద్దు పట్టణం మోరె నుంచి తన తండ్రిని వెతుక్కుంటూ మయన్మార్లోకి బాలుడు వెళ్లే కథతో తెరకెక్కింది.