స్టార్ డైరెక్టర్ అట్లీ, ఆయన భార్య ప్రియా మోహన్ దంపతులు రెండోసారి తల్లిదండ్రులయ్యారు. ఇవాళ ప్రియ ఆడబిడ్డకు జన్మనిచ్చినట్లు అట్లీ సోషల్ మీడియా వేదికగా వెల్లడించాడు. ‘నాకు చెల్లి వచ్చేసింది – మీర్’ అంటూ తన కుమారుడి తరఫున ఒక క్యూట్ పోస్టర్ను షేర్ చేశాడు. 2023లో వీరికి కుమారుడు మీర్ జన్మించగా, ఇప్పుడు ఆడబిడ్డ రావడంతో అట్లీ కుటుంబంలో ఆనందం వెల్లివిరుస్తోంది.
దర్శకుడు హను రాఘవపూడి NTRను ‘సునామీ’ వంటి నటుడని కొనియాడాడు. ఆయనలో Sr. NTR గారి అన్ని లక్షణాలు ఉన్నాయని, పౌరాణికం నుంచి కామెడీ వరకు ఏ పాత్రనైనా చేయగలరని ప్రశంసించాడు. ఇప్పటివరకు సరైన కథ కుదరకపోవడం వల్లే తారక్తో సినిమా చేయలేకపోయానని, ఆయన స్థాయికి తగ్గ స్క్రిప్ట్ సిద్ధం చేయాల్సి ఉందన్నాడు. వేటూరి కూడా తారక్ స్పష్టమైన ఉచ్చారణను మెచ్చుకునేవారని హను గుర్తుచేశాడు.
దిగ్గజ దర్శకుడు భారతీరాజాను నటి రాధిక పరామర్శించిన విషయం తెలిసిందే. అనారోగ్యం నుంచి కోలుకుంటున్న ఆయన్ను కలిసిన వీడియోను ఆమె పంచుకున్నారు. రాధిక నటించిన ‘తాయ్ కిళవి’ సినిమాకు జాతీయ అవార్డు వస్తుందని భారతీరాజా ప్రశంసించారు. తన గురువు ఆశీర్వాదం అన్ని అవార్డుల కన్నా గొప్పదని రాధిక భావోద్వేగానికి లోనయ్యారు. సినిమాపై ఉన్న ప్రేమే ఆయన్ను ముందుకు నడిపిస్తోందని ఆమె పేర్కొన్నారు.
పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ ‘ఉస్తాద్ భగత్ సింగ్’ చిత్రం థియేటర్లలో నిరాశపరిచినప్పటికీ, ఓటీటీలో మాత్రం దుమ్ములేపుతోంది. నెట్ఫ్లిక్స్లో స్ట్రీమింగ్ అవుతున్న ఈ మూవీ ఏకంగా 10కి పైగా దేశాల్లో టాప్ ట్రెండింగ్లో నిలవడం విశేషం. హరీష్ శంకర్ దర్శకత్వంలో వచ్చిన ఈ చిత్రానికి బాక్సాఫీస్ వద్ద మిశ్రమ ఫలితం వచ్చినా, డిజిటల్ వేదికపై మాత్రం పవర్ స్టార్ మేనియా కొనసాగుతోంది.
ధనుష్ హీరోగా నటించిన ‘కర’ చిత్ర ట్రైలర్ విడుదలైంది. విఘ్నేశ్ రాజా దర్శకత్వంలో ధనుష్ ఇందులో బ్యాంక్ దొంగగా సరికొత్తగా కనిపిస్తున్నారు. వరుస దోపిడీలు చేసే దొంగకు కచ్చితంగా ఏదో అవసరం ఉందనే కోణంలో సాగే ఈ థ్రిల్లర్ మూవీలో మమితా బైజు హీరోయిన్. ఈశారీ కె.గణేశ్ నిర్మించిన ఈ చిత్రం ఈనెల 30న థియేటర్లలో విడుదల కానుంది. ధనుష్ మార్క్ నటన సినిమాపై అంచనాలను పెంచేస్తోంది.
దక్షిణాది సినీ పరిశ్రమలో పెను మార్పు చోటుచేసుకుంది. టాలీవుడ్, కోలీవుడ్, మాలీవుడ్, శాండల్వుడ్ అనే తేడా లేకుండా.. దక్షిణాదిలోని 4 సినీ పరిశ్రమలకు చెందిన అగ్ర నిర్మాతలందరూ ఇప్పుడు ఒకే తాటిపైకి వచ్చారు. సినీ పరిశ్రమను వేధిస్తున్న సమస్యలను పరిష్కరించడమే కాకుండా, నిర్మాతల ప్రయోజనాలను కాపాడటమే లక్ష్యంగా ‘సౌత్ ఇండియన్ ఫిల్మ్ ప్రొడ్యూసర్స్ అసోసియేషన్'(SIFPA) ఆవిర్భవించింది.
మెగాస్టార్ చిరంజీవి, వశిష్ట కాంబినేషన్లో తెరకెక్కుతున్న సోషియో ఫాంటసీ చిత్రం ‘విశ్వంభర’. ఈ సినిమాకు సంబంధించిన OTT డీల్ ఈ వారంలో ఖరారయ్యే అవకాశాలు ఉన్నట్లు తెలుస్తోంది. ఈ డీల్ పూర్తయిన వెంటనే, చిత్ర విడుదల తేదీపై అధికారిక ప్రకటన వచ్చే అవకాశం ఉన్నట్లు సమాచారం. ఇక ఈ సినిమాలో త్రిష హీరోయిన్గా నటిస్తోంది.
‘తిమ్మరాజుపల్లి టీవీ’ మూవీ ఈవెంట్లో హీరో కిరణ్ అబ్బవరం ఆసక్తికర వ్యాఖ్యలు చేశాడు. కొత్త నటీనటులతో, తక్కువ బడ్జెట్తో ఈ చిత్రాన్ని తెరకెక్కించామని తెలిపాడు. సినిమా విడుదలైన మొదటి రోజే ఇందులో నటించిన ఐదారుగురికి పెద్ద చిత్రాల్లో అవకాశాలు రావడం తనకు ఎంతో ఆనందాన్ని, గర్వాన్ని కలిగించిందని పేర్కొన్నాడు. ప్రస్తుతం ఈ కామెంట్స్ నెట్టింట వైరల్ అవుతున్నాయి.
ఇన్స్టా సబ్స్క్రిప్షన్ ఫీచర్పై వస్తున్న విమర్శలకు నటి అనన్య నాగళ్ల గట్టి కౌంటర్ ఇచ్చింది. ఈ ఫీచర్ ద్వారా కేవలం తన రోజువారి విశేషాలను అభిమానులతో పంచుకుని, వారితో టచ్లో ఉండటమే తన ఉద్దేశమని వెల్లడించింది. అభ్యంతరకర కంటెంట్ కోసం దీన్ని వాడుతున్నాననడం సరికాదని తెలిపింది. అసత్య ప్రచారాలను నమ్మవద్దని కోరింది.
సూర్య హీరోగా, ఆర్జే బాలాజీ దర్శకత్వంలో వస్తున్న చిత్రం ‘కరుప్పు’. ఈ సినిమా విడుదలపై దర్శకుడు క్రేజీ అప్డేట్ ఇచ్చాడు. ఎన్నికలు ముగిసి, కొత్త ప్రభుత్వం ఏర్పడిన తర్వాతే సినిమాను రిలీజ్ చేయాలని నిర్ణయించినట్లు తెలిపాడు. మే 4న కొత్త ప్రభుత్వం వస్తుంది కాబట్టి, మే 14న ఈ మూవీని థియేటర్లలోకి తీసుకురానున్నట్లు ప్రకటించాడు. వినోదం కోసం ఇది సరైన సమయమని ఆయన భావిస్తున్నాడు.
రామ్ చరణ్, బుచ్చిబాబు కాంబోలో వస్తున్న భారీ చిత్రం ‘పెద్ది’. ఈ సినిమా టాకీ పార్ట్ పూర్తయిందని, కేవలం ఒక ఐటెం సాంగ్ మాత్రమే మిగిలి ఉందని సమాచారం. ఈ స్పెషల్ సాంగ్ కోసం మేకర్స్ సంయుక్త మీనన్ను సంప్రదిస్తున్నట్లు తెలుస్తోంది. ప్రస్తుతం ఆమెతో చర్చలు జరుగుతున్నాయని, అంతా కుదిరితే ఈ క్రేజీ ప్రాజెక్టులో సంయుక్త తన స్టెప్పులతో అలరించడం ఖాయమని ఫిల్మ్ నగర్ టాక్.
‘7/G బృందావన కాలనీ’ సీక్వెల్పై కమెడియన్ సుమన్ శెట్టి అప్డేట్ ఇచ్చాడు. ఇప్పటికే ఈ సినిమా షూటింగ్ 80 శాతం పూర్తయిందని చెప్పాడు. మొదటి భాగం కంటే ఇందులో కామెడీ, ఎమోషన్స్ రెట్టింపు ఉంటాయని తెలిపాడు. ఈ చిత్రంలో తనకు చాలా మంచి పాత్ర లభించిందని, దీని ద్వారా వెండితెరపై సక్సెస్ఫుల్ కంబ్యాక్ ఇస్తానని ఆయన ధీమా వ్యక్తం చేశాడు. దీంతో సినిమాపై అంచనాలు భారీగా పెరిగాయి.
‘యానిమల్’ మూవీ బాలీవుడ్లో ‘యాంగ్రీ యంగ్ మ్యాన్’ కాలాన్ని మళ్లీ తెచ్చిందని అక్షయ్ కుమార్ అన్నాడు. అమితాబ్ కాలం నాటి కోపానికి ఒక పరిమితి ఉండేదని, కానీ సందీప్ వంగా ఆ హద్దులను చెరిపేసి 10 రెట్లు ఎక్కువ తీవ్రతతో చూపించారని ప్రశంసించాడు. బాబీ డియోల్ పాత్రను మర్చిపోలేనన్న ఆయన, ఇప్పుడు ప్రేక్షకులు కేవలం కొరికే హీరోనే కాదు, పదిసార్లు పొడిచే హీరోని కోరుకుంటున్నారని తెలిపాడు.
AP డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ ఆరోగ్యంపై మెగాస్టార్ చిరంజీవి అప్డేట్ ఇచ్చారు. ‘కళ్యాణ్ బాబుకు వైద్య ప్రక్రియ విజయవంతంగా పూర్తయింది. ప్రస్తుతం ఆయన ఆరోగ్యం క్షేమంగా, నిలకడగా ఉంది. వేగంగా కోలుకుంటున్నారు. మరో వారం రోజుల్లో తిరిగి సాధారణ విధుల్లో పాల్గొంటారని వైద్యులు తెలిపారు. అభిమానులు ఎవరూ ఆందోళన చెందవద్దు’ అని చిరంజీవి పేర్కొన్నారు.
నేచురల్ స్టార్ నాని కెరీర్లో ‘జెర్సీ’ ఒక మైలురాయి. గౌతమ్ తిన్ననూరి దర్శకత్వంలో వచ్చిన ఈ క్లాసిక్ నేటికి ఏడేళ్లు పూర్తి చేసుకుంది. విఫలమైన ఓ క్రికెటర్ తన కొడుకు జెర్సీ కోసం పడ్డ తపన, పోరాటం ప్రేక్షకుల హృదయాలను హత్తుకుంది. అనిరుధ్ సంగీతం, నాని నటన ఈ చిత్రాన్ని నేషనల్ అవార్డు స్థాయికి తీసుకెళ్లాయి. అర్జున్ పాత్ర నేటికీ ఎందరికో స్ఫూర్తిదాయకం.