రణవీర్ సింగ్, ఆదిత్య ధర్ల మూవీ ‘ధురందర్: ది రివెంజ్’ బాక్సాఫీస్ వద్ద సెన్సేషన్ క్రియేట్ చేస్తోంది. తాజాగా మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ ఈ చిత్రంపై ప్రశంసలు కురిపించాడు. సినిమా చాలా ‘రా’గా, గ్రిప్పింగ్గా ఉందని, రణవీర్ పెర్ఫార్మెన్స్ అద్భుతమని కొనియాడాడు. మాధవన్, సంజయ్ దత్ నటన సినిమాను మరో స్థాయికి తీసుకెళ్లాయని చరణ్ చేసిన పోస్ట్ ఇప్పుడు వైరల్ అవుతోంది.
దర్శకుడు జీతూ జోసెఫ్, మోహన్ లాల్ కాంబినేషన్లో వస్తున్న మోస్ట్ అవైటెడ్ క్రైమ్ థ్రిల్లర్ ‘దృశ్యం 3’ విడుదల వాయిదా పడినట్లు తెలుస్తోంది. ముందుగా ప్రకటించిన ప్రకారం ఏప్రిల్ 2న విడుదల కావాల్సి ఉండగా, గల్ఫ్ దేశాల్లో నెలకొన్న యుద్ధ వాతావరణం కారణంగా మేకర్స్ ఈ నిర్ణయం తీసుకున్నట్లు సమాచారం. అక్కడ మోహన్ లాల్కు ఉన్న భారీ మార్కెట్ దెబ్బతినకుండా ఉండేందుకే ఈ వాయిదా అని టాక్.
సీరియల్ నటి, బిగ్ బాస్ ఫేమ్ శ్రీ సత్య తన వ్యక్తిగత జీవితం గురించి కీలక వ్యాఖ్యలు చేసింది. ‘నేను ఏడో తరగతి చదువుతున్నప్పుడు రోడ్డు మీద నడుస్తూ వెళుతుంటే ఒకడు నా నడుము గిల్లి వెళ్లిపోయాడు. ఆ ఘటన జరిగిన సమయంలో ఎంతోమంది చుట్టూ ఉన్నారు. కానీ ఒక్కరూ ముందుకు వచ్చి ఆపలేదు. నాకు ఇప్పటికీ తప్పుడు ఉద్దేశాలతో ఫోన్ కాల్స్ వస్తుంటాయి‘ అని భావోద్వేగానికి గురైంది.
ప్రేమదేశం హీరో అబ్బాస్ సుదీర్ఘ విరామం తర్వాత ‘హ్యాపీరాజ్’ సినిమాతో తిరిగి వెండితెరపై మెరవనున్నారు. జీవీ ప్రకాష్ కుమార్ హీరోగా నటించిన ఈ చిత్రంలో అబ్బాస్ ఒక కీలక పాత్ర పోషించనున్నారు. కథ బాగా నచ్చడంతోనే ఆయన గ్రీన్ సిగ్నల్ ఇచ్చారని దర్శకుడు మరియా రాజా తెలిపారు. ఈ నెల 27న విడుదల కానున్న ఈ సినిమా ట్రైలర్ లాంచ్ వేడుక హైదరాబాద్లో ఘనంగా నిర్వహించారు.
రణవీర్ సింగ్ హీరోగా ఆదిత్య ధర్ దర్శకత్వంలో రూపొందిన ‘ధురంధర్ 2’ హిట్ టాక్ సొంతం చేసుకుంది. అయితే సినిమాపై కన్నడ నటి, రాజకీయ నాయకురాలు దివ్య స్పందన చేసిన వ్యాఖ్యలు తీవ్ర చర్చనీయాంశంగా మారాయి. ‘నాకు ధురంధర్ 2 ఏ మాత్రం నచ్చలేదు. అదొక పరమ చెత్త సినిమా. మూవీ చూస్తూ థియేటర్లోనే నిద్రపోయాను’ అని వ్యాఖ్యానించింది. ఈ వ్యాఖ్యలపై అభిమానులు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.
పవర్ స్టార్ పవన్ కళ్యాణ్, దర్శకుడు హరీష్ శంకర్ కాంబోలో తెరకెక్కిన తాజా చిత్రం ‘ఉస్తాద్ భగత్ సింగ్’. ఈ మూవీకి మిశ్రమ స్పందన వచ్చినప్పటికీ.. బాక్సాఫీస్ వద్ద మంచి వసూళ్ల రాబట్టింది. నైజాం రీజియన్లో మొదటి రోజు సుమారు రూ. 6.5 కోట్ల షేర్ను రాబట్టింది. మైత్రీ మూవీ మేకర్స్ నిర్మించిన ఈ సినిమాలో శ్రీలీల, రాశీ ఖన్నా హీరోయిన్లుగా నటించారు.
హీరో విజయ్ ఆంటోని, దర్శకుడు శశి కాంబినేషన్లో వచ్చిన ‘బిచ్చగాడు’ చిత్రం హిట్ కొట్టిన విషయం తెలిసిందే. తాజాగా ఈ కాంబినేషన్లో మరో ప్రాజెక్టు తెరకెక్కించనున్నట్లు మేకర్స్ ప్రకటించారు. ‘వంద దేవుళ్లు’ అనే టైటిల్ ఖరారు చేస్తూ.. ఇందుకు సంబంధించిన పోస్టర్ను విడుదల చేశారు. ఈ మూవీలో విజయ్ సాధారణ రైతు పాత్రలో కనిపించనున్నట్లు తెలుస్తోంది.
బాలీవుడ్ ప్రతిష్టాత్మక మూవీ ‘రామాయణం’ నుంచి నయా అప్డేట్ వచ్చింది. శ్రీరామనవమి కానుకగా ఈ చిత్ర టీజర్ విడుదల కానున్నట్లు తెలుస్తోంది. దీనిపై అధికారిక ప్రకటన రావాల్సి ఉంది. రణ్బీర్, సాయి పల్లవి, యష్ ప్రధాన పాత్రల్లో నటిస్తున్న ఈ మూవీ 2026 దీపావళి కానుకగా విడుదల చేయనున్నట్లు మేకర్స్ వెల్లడించారు.
రణ్వీర్ సింగ్ హీరోగా నటించిన తాజా చిత్రం ‘ధురంధర్ ది రివెంజ్’కి ప్రేక్షకుల నుంచి మంచి రెస్పాన్స్ వస్తోంది. తాజాగా తెలుగు వెర్షన్ విడుదలకు కూడా రంగం సిద్ధం చేసినట్లు మేకర్స్ ప్రకటించారు. మార్చి 21 నుంచి తెలుగులో విడుదల చేయనున్నట్లు తెలిపారు. కాగా, ఆదిత్యధర్ దర్శకత్వం వహించిన ఈ సినిమా కొన్ని డబ్బింగ్ పనుల కారణంగా తెలుగు విడుదల ఆలస్యమైన సంగతి తెలిసిందే.
భారీ అంచనాల మధ్య రిలీజైన ధురంధర్-2 మూవీ పాజిటివ్ టాక్తో దూసుకెళ్తోంది. ప్రపంచవ్యాప్తంగా ఫస్ట్ డే రూ.241 కోట్ల నెట్ వసూళ్లు నమోదు చేసింది. బాలీవుడ్ చరిత్రలోనే అతిపెద్ద ఓపెనర్గా రికార్డు సృష్టించింది. లాంగ్ వీకెండ్ కావడంతో కలెక్షన్లు భారీగా పెరిగే అవకాశం ఉంది. ఇక రణవీర్ సింగ్ హీరోగా నటించిన ఈ చిత్రానికి ఆదిత్యధర్ దర్శకత్వం వహించాడు.
భారీ అంచనాల మధ్య రిలీజైన ధురంధర్-2 మూవీ పాజిటివ్ టాక్తో దూసుకెళ్తోంది. ప్రపంచవ్యాప్తంగా ఫస్ట్ డే రూ.241 కోట్ల నెట్ వసూళ్లు నమోదు చేసింది. బాలీవుడ్ చరిత్రలోనే అతిపెద్ద ఓపెనర్గా రికార్డు సృష్టించింది. లాంగ్ వీకెండ్ కావడంతో కలెక్షన్లు భారీగా పెరిగే అవకాశం ఉంది. ఇక రణవీర్ సింగ్ హీరోగా నటించిన ఈ చిత్రానికి ఆదిత్యధర్ దర్శకత్వం వహించాడు.
రామ్ చరణ్ ‘పెద్ది’ మూవీ వాయిదా పడుతుందన్న వార్తలపై చిత్రబృందం స్పందించింది. ఈ సినిమాని ఏప్రిల్ 30న గ్రాండ్గా రిలీజ్ చేసేందుకు ప్లాన్ చేస్తున్నారు. ఈ నెల 27న రామ్ చరణ్ పుట్టినరోజు సందర్భంగా US బుకింగ్స్ కూడా అదే రోజు ఓపెన్ చేసే అవకాశం ఉంది. ప్రస్తుతం చరణ్ అయ్యప్ప దీక్షలో ఉండటంతో, అది పూర్తయ్యాక పెండింగ్ ఉన్న స్పెషల్ సాంగ్ షూట్ చేయనున్నారు.
అనన్య పాండే నటించిన కాల్ మీ బే మొదటి సీజన్ హిట్ కావడంతో, అమెజాన్ ప్రైమ్ రెండో సీజన్ను సిద్ధం చేస్తోంది. తాజాగా ఈ క్రేజీ ప్రాజెక్టులోకి స్టార్ హీరోయిన్ శృతి హాసన్ చేరినట్లు వార్తలు వస్తున్నాయి. మరింత డ్రామా, కామెడీ, ఊహించని మలుపులతో రానున్న ఈ కొత్త సీజన్పై శృతి రాకతో అంచనాలు భారీగా పెరిగాయి. ఆమె ఇందులో ఒక కీలక పాత్రలో మెరవనుందని సమాచారం.
TG ప్రభుత్వం అందించిన గద్దర్ అవార్డుల్లో నటుడు చిరంజీవికి NTR అవార్డు వచ్చింది. దీనిపై ఆయన స్పందిస్తూ.. ‘చరిత్ర కర్తగా నిలిచిన నందమూరి తారక రామారావు తన పేరుతోనే లలిత కళలను ముందుకు తీసుకుని వెళ్లిన మహా కళాకారుడు. NTR అంటే N నాట్యం, T తాళం, R రాగం.. కళల సమ్మేళనం అలాంటి మహానుభావుని పేరుతో ఉన్న ‘NTR నేషనల్ అవార్డు’ రావడం జీవితంలో గొప్ప గౌరవంగా భావిస్తున్నాను’ అని రాసుకొచ్చాడు.
నటి నిమిషా నాయర్కు ముంబైలో నడిరోడ్డుపై చేదు అనుభవం ఎదురైంది. తెల్లవారుజామున క్యాబ్లో వెళ్తుండగా, మద్యం మత్తులో ఉన్న ఆకతాయిలు బైక్తో కారును అడ్డుకున్నారు. ఆమెను, డ్రైవర్ను అసభ్య పదజాలంతో దూషిస్తూ వేధించారు. ఈ భయానక దృశ్యాలను నిమిషా వీడియో తీసి SM వేదికగా పోలీసులకు ఫిర్యాదు చేశారు. ఆకతాయిలపై కఠిన చర్యలు తీసుకోవాలని కోరారు.