చిన్నారి పునర్వికను కాపాడుకునేందుకు తెలుగు రాష్ట్రాల యువత ఏకమై విరాళాలు సేకరిస్తుండటంపై నటుడు మంచు మనోజ్ స్పందించాడు. పాప పరిస్థితి తెలిసి తన హృదయం ముక్కలైందని, ఆమెకు పునర్జన్మ నివ్వాలని ఆకాంక్షించాడు. సాయం కోసం పీఎంఓ, ఇరు రాష్ట్రాల సీఎంలను ట్యాగ్ చేశాడు. ప్రస్తుతం పాప ఆరోగ్యం దృష్ట్యా ఎవరూ కలవడానికి ప్రయత్నించవద్దని, ఆమె కోలుకుంటే అందరం గెలిచినట్లేనని మనోజ్ పేర్కొన్నాడు.