MDK: తూప్రాన్ టోల్ ప్లాజా వద్ద సోమవారం సాయంత్రం పోలీసులు జరిపిన తనిఖీల్లో భారీగా రేషన్ బియ్యం పట్టుబడింది. హైదరాబాద్ నుండి మహారాష్ట్రకు లారీలో అక్రమంగా తరలిస్తున్న సుమారు 300 క్వింటాళ్ల బియ్యాన్ని ఎస్సై గంగరాజు బృందం స్వాధీనం చేసుకుంది. నిబంధనలకు విరుద్ధంగా తరలిస్తున్న ఈ నిల్వలను పట్టుకుని, లారీని స్టేషన్కు తరలించారు.