శ్రీవిష్ణు, నయన్ సారిక జంటగా నటించిన ‘విష్ణు విన్యాసం’ రేపు విడుదల కానుంది. యదునాథ్ మారుతీరావు దర్శకత్వంలో రూపొందిన ఈ చిత్రం 100% వినోదాన్ని పంచుతుందని, ఫ్యామిలీతో కలిసి హాయిగా నవ్వుకోవచ్చని శ్రీవిష్ణు ధీమా వ్యక్తం చేశాడు. ఫస్టాఫ్ యువతకు, సెకండాఫ్ కుటుంబ ప్రేక్షకులకు బాగా నచ్చుతుందని చిత్రబృందం తెలిపింది. ఈ మూవీలో విష్ణు విన్యాసాలు బాగుంటాయని నిర్మాత తెలిపారు.
నాగచైతన్య హీరోగా కార్తీక్ దండు దర్శకత్వంలో తెరకెక్కుతున్న పాన్ ఇండియా చిత్రం ‘వృషకర్మ’. నిధి అన్వేషకుడైన ‘అర్జున్’ పాత్రలో చైతూ కనిపిస్తాడని సమాచారం. మార్చి 5న ఈ మూవీ గ్లింప్స్ను విడుదల చేయనున్నట్లు మేకర్స్ ప్రకటించారు. మీనాక్షి చౌదరి కథానాయికగా, అజనీష్ లోక్నాథ్ సంగీతం అందిస్తోన్న ఈ చిత్రం, త్వరలోనే ప్రేక్షకుల ముందుకు రానుంది.
నటి తమన్నా తన ఆర్థిక క్రమశిక్షణ రహస్యాన్ని పంచుకుంది. కెరీర్ పీక్లో ఉన్నప్పుడే డబ్బు ఆదా చేయడం, పెట్టుబడులు పెట్టడం అవసరమని ఆమె సూచించింది. తన తండ్రి మార్గనిర్దేశం వల్లే వ్యాపార రంగంలో రాణిస్తున్నట్లు తెలిపింది. సినీ రంగంలో ఆదాయం ఎప్పుడూ ఒకేలా ఉండదని, ముందుచూపు లేకపోతే చివరకు ఏమీ మిగలదని హెచ్చరించింది. ప్రస్తుతం ఆమె ‘పురుషన్’ సినిమా షూటింగ్లో బిజీగా ఉంది.
HYDలోని అన్నపూర్ణ స్టూడియోస్లో అత్యాధునిక ‘A&M మోషన్ క్యాప్చర్ ల్యాబ్’ను రాజమౌళి ప్రారంభించారు. ‘బాహుబలి’, ‘ఈగ’ సమయంలో లేని ఈ సాంకేతికత ఇప్పుడు అందుబాటులోకి రావడం సంతోషకరమని, దీనితో భారతీయ సినిమాల స్థాయి మారుతుందని ఆకాంక్షించారు. ‘వారణాసి’ కోసం ఈ టెక్నాలజీని వాడామని, ఫలితాలు అద్భుతంగా వచ్చాయని రాజమౌళి వెల్లడించారు.
మహేష్ బాబు మేనల్లుడు అశోక్ గల్లా హీరోగా నటిస్తున్న తాజా చిత్రం ‘వీసా’. ఈ చిత్రానికి ఉద్భవ్ రఘు దర్శకత్వం వహిస్తున్నాడు. తాజాగా మేకర్స్ ‘అనగ అనగ అమెరికా’ అనే ఫస్ట్ సింగిల్ను ఈనెల 28న విడుదల చేయనున్నట్లు ప్రకటించారు. ఈ మూవీకి ‘బేబీ’ ఫేమ్ విజయ్ బుల్గానిన్ సంగీతం అందించాడు. ఈ చిత్రంలో గౌరీ ప్రియ, రాహుల్ విజయ్, శివాత్మిక రాజశేఖర్ ప్రధాన పాత్రల్లో నటిస్తున్నారు.
నాగ చైతన్య, మీనాక్షి చౌదరి కలయికలో వస్తున్న భారీ బడ్జెట్ చిత్రం ఫిల్మ్ ‘వృషకర్మ’. ‘విరూపాక్ష’ చిత్రంతో హిట్ అందుకున్న కార్తీక్ దండు ఈ చిత్రాన్ని తెరకెక్కిస్తున్నాడు. ఈ మూవీ గ్లింప్స్ మార్చి 5న విడుదల చేయనున్నట్లు తెలుపుతూ.. మేకర్స్ తాజాగా ఓ పోస్టర్ను విడుదల చేశారు. చైతన్య ఇందులో నిధి అన్వేషకుడిగా కనిపిస్తుండగా, మీనాక్షి చౌదరి ఆర్కియాలజిస్ట్గా నటిస్తోంది.
శివాజీ హీరోగా నటించిన చిత్రం ‘సాంప్రదాయిని సుప్పిని సుద్దపూసని’. ఈ సినిమా మార్చి 6న థియేటర్లలో విడుదల కానుంది. ఈ నేపథ్యంలో శివాజీ మాట్లాడుతూ.. ఈ సినిమాను థియేటర్లో చూస్తే వచ్చే మాజానే వేరని తెలిపాడు. ఇప్పటికే సినిమా చూసిన వాళ్లంతా ఫుల్గా నవ్వుకున్నట్లు పేర్కొన్నాడు. అందరికి నచ్చే సినిమా తీశాం, ఈ మూవీ కచ్చితంగా విజయం సాధింస్తుందని ధీమా వ్యక్తం చేశాడు.
ఇటీవల ‘ది రాజాసాబ్’ మూవీతో డిజాస్టర్ అందుకున్న దర్శకుడు మారుతి మరో ప్రాజెక్టు చేసేందుకు సిద్ధమవుతున్నాడు. ‘హ్యాపీ పొంగల్’ అనే టైటిల్తో ఓ మూవీ తెరకెక్కించనున్నాడట. ఇప్పటికే ఓ కామెడీ కథను సిద్ధం చేసినట్లు, హీరో కోసం వెతుకులాట స్టార్ట్ చేసినట్లు టాక్ నడుస్తోంది. ఈ మూవీని 2027 సంక్రాంతికి రిలీజ్ చేయనున్నట్లు వార్తలొస్తున్నాయి. మరి ఇందులో ఎంతవరకు నిజం ఉందో తెలియాల్సి ఉంది.
టాలీవుడ్ హీరో నవీన్ చంద్ర, దివ్య పిళ్లై ప్రధాన పాత్రల్లో నటించిన సైకలాజికల్ హర్రర్ థ్రిల్లర్ ‘హనీ’. కరుణ కుమార్ తెరకెక్కించిన ఈ సినిమా సన్నెక్స్ట్లో FEB 27 నుంచి తెలుగు, తమిళ భాషల్లో స్ట్రీమింగ్ కానుంది. తాజాగా ఈ సినిమా మరో OTTలోకి రాబోతుంది. అమెజాన్ ప్రైమ్లో కూడా FEB 27 నుంచి అందుబాటులో ఉండనుంది.
యంగ్ హీరో తేజ సజ్జా నటించిన ‘జాంబీరెడ్డి’ మూవీకి సీక్వెల్గా ‘జాంబీరెడ్డి 2’ రాబోతుంది. తాజాగా ఈ సినిమా స్క్రిప్ట్ వర్క్ పూర్తయినట్లు తెలుస్తోంది. ఈ సినిమాకు దర్శకుడు ప్రశాంత్ వర్మ కథను అందించాడట. ఫస్ట్ పార్ట్ కంటే ఈ మూవీ అంతకుమించి వైల్డ్గా ఉంటుందట. VFX విషయంలో మరిన్ని జాగ్రత్తలు తీసుకుంటున్నారట. జాంబీలతో పోరాడే సన్నివేశాలు ఈసారి మరింత డెడ్లీగా ఉంటాయని టాక్.
నటి పూనమ్ కౌర్ చేసిన ట్వీట్ రాజకీయాల్లో దుమారం రేపుతోంది. ‘రాజకీయాల కోసం హిందూ సంప్రదాయ దుస్తులు ధరిస్తూ, సొంత పిల్లలకు మూడు నెలలకే విదేశాల్లో బాప్టిజం ఎందుకు ఇప్పించారు? ఇది రాజకీయ డ్రామానా?’ అని ఆమె ప్రశ్నించింది. ఇవి కేవలం సందేహాలేనని ఆమె అన్నా, ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ను ఉద్దేశించే ఈ విమర్శలు చేశారని నెట్టింట చర్చ నడుస్తోంది.
టాలీవుడ్ నటి వైష్ణవి చైతన్య కోలీవుడ్లో హీరోయిన్గా అడుగుపెట్టనున్నట్లు తెలుస్తోంది. మ్యూజిక్ డైరెక్టర్ జీవీ ప్రకాష్ కుమార్ హీరోగా రాబోతున్న చిత్రంలో ఆమెను కథానాయికగా ఎంపిక చేసినట్లు సమాచారం. గతంలో అజిత్ కుమార్ ‘వలిమై’లో చిన్న పాత్ర పోషించిన వైష్ణవి.. ఇప్పుడు పూర్తిస్థాయి హీరోయిన్గా తమిళ ప్రేక్షకులను అలరించనున్నట్లు టాక్.
విజయ్ దేవరకొండ, రష్మిక మందన్నల వివాహం ఫిబ్రవరి 26న ఉదయ్పూర్లో జరగనుంది. ఇప్పటికే ప్రీ-వెడ్డింగ్ వేడుకలు ఘనంగా ప్రారంభమయ్యాయి. ‘Virosh Premier League’ (VPL) పేరుతో నిర్వహించిన క్రికెట్ మ్యాచ్, పూల్ వాలీబాల్ ఫొటోలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. విజయ్ పాప్కార్న్ బకెట్ ఫొటో, రష్మిక గ్రౌండ్ ఫొటోలతో ఈ జంట తమ పెళ్లి సందడిని అభిమానులతో పంచుకున్నారు.
తన పదేళ్ల కష్టానికి దక్కిన అరుదైన బహుమతిగా ‘డంకీ’ సినిమా అని నటి తాప్సీ తెలిపింది. పరిశ్రమలో తనకంటూ ప్రత్యేక గుర్తింపు ఉన్నా, మెయిన్ స్ట్రీమ్ హీరోయిన్గా అంగీకరించేందుకు మేకర్స్ సమయం తీసుకుంటున్నారని పేర్కొంది. ‘పింక్’, ‘తప్పడ్’ వంటి వైవిధ్యమైన సినిమాల్లో తన నటనను చూసే దర్శకుడు రాజ్కుమార్ హిరానీ తనకు ‘డంకీ’ అవకాశం ఇచ్చాడని వెల్లడి...
ప్రముఖ హీరోయిన్ ప్రియాంక చోప్రా నటించిన యాక్షన్ మూవీ ‘ది బ్లఫ్’. నేరుగా ఈ సినిమా OTTలో విడుదలైంది. ప్రస్తుతం అమెజాన్ ప్రైమ్లో ఈ మూవీ ఇంగ్లీష్, తెలుగుతో సహా 19 భాషల్లో స్ట్రీమింగ్ అవుతోంది. దర్శకుడు ఫ్రాంక్ ఇ ఫ్లవర్స్ తెరకెక్కించిన ఈ మూవీలో కార్ల్ అర్బన్ ప్రధాన పాత్ర పోషించాడు. ఇక ప్రియాంక ప్రస్తుతం ‘వారణాసి’ సినిమాతో బిజీగా ఉంది.