నటి దివ్య శ్రీపాద, అభయ్ నవీన్ ప్రధాన పాత్రల్లో నటించిన చిన్న బడ్జెట్ రొమాంటిక్ డ్రామా ‘చరిత కామాక్షి’. 2021లో ప్రకటించిన ఈ చిత్రం ద్వారా శ్రీలంక చందు సాయి దర్శకుడిగా పరిచయమవుతున్నాడు. ఈ మూవీ ఎట్టకేలకు విడుదలకు సిద్ధమైంది. ప్రముఖ ఓటీటీ ప్లాట్ఫామ్ ‘’ఈటీవీ విన్’లో మార్చి 5, 2026 నుంచి స్ట్రీమింగ్ కానున్నట్లు మేకర్స్ అధికారికంగా ప్రకటించారు.