గ్లోబల్ స్టార్ రామ్ చరణ్, డైరెక్టర్ శంకర్ కాంబినేషన్లో తెరకెక్కుతున్న చిత్రం ‘గేమ్ ఛేంజర్’. ఈ చిత్రం వచ్చే ఏడాది జనవరి 10న ప్రపంచ వ్యాప్తంగా విడుదల కానుంది. అయితే, మమూలుగానే తన సినిమాల్లోని సాంగ్స్కు కోట్ల రూపాయలను ఖర్చుపెట్టడం డైరెక్టర్ శంకర్ స్పెషాలిటీ. ఈ నేపథ్యంలోనే ‘నానా హైరానా’ సాంగ్ను న్యూజిలాండ్లో చిత్రీకరించారు. ఈ సాంగ్ క...
మంచు ఫ్యామిలీలో గొడవలపై ప్రముఖ నిర్మాత నట్టి కుమార్ స్పందించాడు. మొహన్ బాబు ముక్కుసూటి మనిషని, ఇండస్ట్రీలో అతను ఓ టైగర్ అని పేర్కొన్నాడు. మంచు కుటుంబానికి చాలా మంచి పేరు ఉందన్నారు. అలాంటి ఫ్యామిలీలో గొడవలు జరగడం దురదృష్టకరమన్నారు. వారికి ఏదో నగఘోష తగిలినట్లుందని, మోహన్ బాబు తప్ప వారి వివాదాన్ని ఎవరూ పరిష్కరించలేరన్నారు.
ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ నటించిన పుష్ప-2 దేశ సినిమా చరిత్రలో రికార్డులు నెలకొల్పుతోంది. ఐదు రోజుల్లోనే 922 కోట్లు వసూల్ చేసిన తొలి ఇండియా సినిమాగా రికార్డు సృష్టించింది. ఈ విషయాన్ని మైత్రీ మూవీ మేకర్స్ అధికారికంగా ప్రకటిస్తూ పోస్టర్ విడుదల చేశారు.
బాలీవుడ్ ముద్దు గుమ్మ జాన్వీ కపూర్ సామాజిక మాధ్యమాల్లో ఎప్పుడూ యాక్టీవ్గా ఉంటుంది. తాజాగా తన ఇన్స్టాగ్రమ్ ఖాతాలో స్టన్నింగ్ లుక్స్తో చేసిన ఫొటో షూట్ను షేర్ చేసింది. దీనికి పుష్ టు స్టార్ట్ అనే క్యాప్షన్ పెట్టింది. అయితే జాన్వీ పోస్ట్కు సీతారామం ముద్దుగుమ్మ మృణాల్ ఠాకూర్ రిప్లే ఇస్తూ ఫైర్ ఎమోజీని పెట్టింది. ప్రస్తుతం ఈ అమ్మడి ఫొటో షూట్ తెగ వైరల్ అవుతోంది.
నాగ చైతన్య- కార్తిక్ వర్మ దండు కాంబినేషన్లో రాబోతున్న సినిమా శ్రీ వెంకటేశ్వర సినీ చిత్ర, సుకుమార్ రైటింగ్స్ బ్యానర్లపై సంయుక్తంగా నిర్మిస్తున్నారు. అయితే ఈ సినిమాలో హీరోయిన్గా మీనాక్షి చౌదరిని అనుకున్న మేకర్స్ తాజాగా హైపర్ బ్యూటీ శ్రీలీలను ఎంపిక చేసినట్లు వార్తలు వినిపిస్తున్నాయి. త్వరలోనే వీరికి సంబంధించిన ఫస్ట్ లుక్ని కూడా విడుదల చేయనున్నట్లు తెలుస్తోంది. కానీ దీనిపై చిత్ర బ...
టాలీవుడ్ యంగ్ హీరో తేజ సజ్జా, దర్శకుడు కార్తీక్ ఘట్టమనేని కాంబోలో ‘మిరాయ్’ మూవీ రాబోతుంది. ఈ సినిమాలో సీనియర్ హీరోయిన్ శ్రియ శరణ్ కనిపించనున్నట్లు తెలుస్తోంది. స్పెషల్ సాంగ్ చేయనున్నట్లు సమాచారం. కాగా, దీనిపై అధికారిక ప్రకటన రావాల్సి ఉంది. ఇక ఈ సినిమాను పీపుల్ మీడియా ఫ్యాక్టరీ నిర్మిస్తోంది.
మోహన్ బాబు ఫామ్హౌజ్లో పోలీసుల విచారణ ముగిసింది. మోహన్ బాబు స్టేట్మెంట్ను రికార్డు చేశారు. మనోజ్ మీద జరిగిన దాడిపై ఏసీపీ లక్ష్మీకాంత్ రెడ్డి ప్రశ్నించారు. మనోజ్, మౌనికతో తనకు ప్రాణహాని ఉందని మోహన్ బాబు తెలిపారు. సీసీటీవీ ఫుటేజ్ మాయం కావటంపై పోలీసులు ఆరా తీశారు. ఫుటేజ్ అప్పగించాలని మోహన్ బాబును ఆదేశించారు. మనోజ్ స్టేట్మెంట్ కూడా రికార్డు చేయనున్నట్లు పోలీసులు తెలిపారు.
AP: అనంతపురం జిల్లా రాయదుర్గంలోని థియేటర్లో పుష్ప 2 చూస్తూ ముద్దానప్ప అనే అభిమాని అనుమానాస్పద స్థితిలో మృతి చెందాడు. షో ముగిశాక కూడా అతను సీటులో అలానే కూర్చొని ఉండగా.. మిగతా ప్రేక్షకులకు అనుమానం వచ్చి థియేటర్ యాజమాన్యం దృష్టికి తీసుకెళ్లారు. ఘటనా స్థలానికి చేరుకున్న మృతుడి కుటుంబీకులు.. ముద్దానప్ప తొక్కిసలాట వల్లే చనిపోయాడని ఆందోళనకు దిగారు. ఘటనపై కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు చేస్తున...
ఐకాన్ స్టార్ అల్లు అర్జున్, డైరెక్టర్ సుకుమార్ కాంబోలో తెరకెక్కిన ‘పుష్ప 2’ సినిమా సాలిడ్ వసూళ్లతో దూసుకెళ్తోంది. ముఖ్యంగా హిందీలో మంచి రెస్పాన్స్ దక్కించుకుంటోంది. అక్కడ ఐదో రోజు ఈ సినిమా రూ.48 కోట్ల కలెక్షన్స్ సాధించింది. బాలీవుడ్లో ఇప్పటివరకు ఈ సినిమా రూ.339 కోట్ల నెట్ వసూళ్లు రాబట్టింది. దీంతో అక్కడ అతి తక్కువ సమయంలో ఈ ఘనత సాధించిన సినిమాగా రికార్డుకెక్కింది. ఈ మేరకు మేకర్...
జల్పల్లిలోని మోహన్ బాబు ఇంటి వద్ద ఉద్రిక్తత నెలకొంది. మంచు మనోజ్, విష్ణు బౌన్సర్ల మధ్య తగాదా జరిగింది. విష్ణు బౌన్సర్లు మనోజ్ బౌన్సర్లను ఇంటి నుంచి బయటకు పంపుతున్న క్రమంలో ఘర్షణ తలెత్తింది. మనోజ్ భార్య మౌనికతో బౌన్సర్లు వీడియో కాల్ మాట్లాడుతుండగా విష్ణు వచ్చి వారిని బయటకు తోసేశారు. కాగా, ఇప్పటికే పోలీసులు మోహన్ బాబు ఇంటికి చేరుకుని, మనోజ్పై దాడి ఫుటేజ్ మాయం కావటంపై విచార...
ఐకాన్ స్టార్ అల్లు అర్జున్, రష్మికా మందన్న జంటగా నటించిన ‘పుష్ప 2’ బాక్సాఫీస్ వద్ద మంచి వసూళ్లు రాబడుతోంది. ముఖ్యంగా నార్త్ అమెరికాలో మంచి కలెక్షన్స్ రాబడుతూ దూసుకెళ్తోంది. అక్కడ $10 మిలియన్ల మార్క్ను దాటేసింది. ఈ విషయాన్ని తెలుపుతూ మేకర్స్ పవర్ ఫుల్ పోస్టర్ షేర్ చేశారు. ఇక మైత్రీ మూవీ మేకర్స్ ఈ సినిమాను నిర్మించగా.. దేవిశ్రీ ప్రసాద్ మ్యూజిక్ అందించారు.
డబ్బు, ఆస్తి కోసం కాదని.. తన ఆత్మ గౌరవం కోసం పోరాటం చేస్తున్నట్లు మంచు మనోజ్ తెలిపారు. మోహన్ బాబు నివాసంలో చర్చల సందర్భంగా తన బౌన్సర్లను బయటకు పంపటంతో మనోజ్ ఫైర్ అయ్యారు. ‘పోలీసులు ఏకపక్షంగా వ్యవహరిస్తున్నారు. నా బిడ్డలు ఇంట్లో ఉండగా ఇలా చేయటం సరికాదు. న్యాయం కోసం అందరినీ కలుస్తా. నా భార్యా పిల్లలకు రక్షణ లేకుండా పోయింది.. అందుకే ఈ పోరాటం’ అని మీడియాతో అన్నారు.
గ్లోబల్ స్టార్ రామ్ చరణ్, కియారా అద్వానీ జంటగా తెరకెక్కుతోన్న మూవీ ‘గేమ్ ఛేంజర్’. వచ్చే ఏడాది జనవరి 10న ఇది విడుదలవుతుంది. ఈ నేపథ్యంలో ఈ సినిమా ట్రైలర్పై ఇంట్రెస్టింగ్ బజ్ నెలకొంది. ఈ నెల చివరిలో దీన్ని రిలీజ్ చేయాలని మేకర్స్ భావిస్తున్నారట. దీనిపై త్వరలోనే అధికారిక ప్రకటన రానున్నట్లు సమాచారం. దర్శకుడు శంకర్ ఈ మూవీని తెరకెక్కిస్తుండగా.. తమన్ మ్యూజిక్ అందిస్తున్నారు.
బాలీవుడ్ హీరో రణ్బీర్ కపూర్, సాయి పల్లవి సీతారాములుగా నటిస్తోన్న సినిమా ‘రామాయణ’. ఈ సినిమాలో మరో సీనియర్ యాక్టర్ సన్నీ డియోల్ భాగమయ్యారు. ఈ విషయాన్ని సన్నీ డియోల్ అధికారికంగా ప్రకటించారు. కాగా ఎంతో ప్రతిష్ఠాత్మకంగా తెరకెక్కుతోన్న ఈ మూవీకి నితేశ్ తివారీ దర్శకత్వం వహిస్తున్నారు. ఇక 2026 దీపావళికి ఈ మూవీ మొదటి భాగం, 2027 దీపావళికి రెండో భాగం విడుదల కానుంది.
బాలీవుడ్ హీరో రణ్బీర్ కపూర్ ప్రధాన పాత్రలో సందీప్ రెడ్డి వంగా తెరకెక్కించిన ‘యానిమల్’ మూవీ బ్లాక్ బస్టర్ హిట్ అందుకుంది. ఈ మూవీకి సీక్వెల్ ఉంటుందని మేకర్స్ ప్రకటించిన విషయం తెలిసిందే. తాజాగా ఈ సినిమాపై రణ్బీర్ అప్డేట్ ఇచ్చారు. దీని షూటింగ్ 2027 స్టార్ట్ కానున్నట్లు, ఇందులో హీరో విలన్ మధ్య ఆసక్తికర పోరు ఉంటుందని పేర్కొన్నారు. అలాగే యానిమల్ పార్ట్ 3 కూడా ఉంటుంద...