NLR: స్వామి వివేకానంద జయంతి సందర్భంగా జనవరి 11, 2026 న విడవలూరు హైస్కూల్లో ఉదయం 8 గంటల నుంచి రక్తదాన శిబిరం నిర్వహించనున్నట్లు రాష్ట్ర ఎన్విరాన్మెంట్ మెనెజ్మెంట్ కార్పొరేషన్ ఛైర్మన్ పోలంరెడ్డి దినేష్ రెడ్డి తెలిపారు. ఈ రక్తదాన శిబిరాన్ని విడవలూరు రెడ్ క్రాస్ శాఖ ఆధ్వర్యంలో ఏర్పాటు చేస్తున్నారన్నారు. రక్తదానం చేయడంలో యువత ముందు ఉండాలని పిలుపునిచ్చారు.