MBNR: పదో తరగతి ఫలితాల్లో జిల్లాను రాష్ట్రస్థాయిలో ప్రథమ స్థానంలో నిలిచేలా ఉపాధ్యాయులు కృషి చేయాలని ఎమ్మెల్యే యెన్నం శ్రీనివాస్ రెడ్డి పిలుపునిచ్చారు. శనివారం జిల్లా కేంద్రంలో TSTU నూతన క్యాలెండర్ను ఆయన ఆవిష్కరించి ఉపాధ్యాయుల సమస్యలు పరిష్కరించేందుకు కృషి చేస్తామన్నారు. ఈ కార్యక్రమంలో జిల్లా సంఘం నాయకులు పాల్గొన్నారు.