ప్రకాశం: ఒంగోలు నుంచి విజయవాడ వైపు వెళుతున్న కారు శనివారం మద్దిపాడు వద్ద లారీని క్రాస్ చేస్తుండగా ప్రమాదానికి గురైంది. వేగాన్ని అధిగమించలేక కారు లారీకి అడ్డు రాగా, లారీ కారును కొంత దూరం ఈడ్చుకు వెళ్ళింది. అదృష్టవశాత్తు కారులో ఉన్న ప్రయాణికులకు ఎటువంటి గాయాలు జరగకపోవడంతో అందరూ ఊపిరి పీల్చుకున్నారు. సంఘటనా స్థలానికి చేరుకున్న పోలీసులు ట్రాఫిక్ను క్లియర్ చేశారు.