అన్నమయ్య: మదనపల్లిలో విలువలతో కూడిన విద్య విజయభారతి పాఠశాలలోనే అందుతోందని ఎమ్మెల్యే షాజహాన్ బాషా అన్నారు. బుధవారం జరిగిన స్కూల్ వార్షికోత్సవానికి ముఖ్య అతిథిగా హాజరై విద్యార్థులతో ముచ్చటించారు. మండల స్థాయి నుంచి రాష్ట్ర స్థాయి వరకు విజయభారతి విద్యార్థులు ర్యాంకులు సాధిస్తూ ముందంజలో ఉన్నారని తెలిపారు.