NZB: నిజామాబాద్ నగర నడిబొడ్డున గల రాజీవ్ గాంధీ ఆడిటోరియం, న్యూ అంబేద్కర్ భవన్లను ఇవాళ కలెక్టర్ ఇలా త్రిపాఠి సందర్శించారు. ఈ సందర్భంగా ఆడిటోరియం హాల్, పరిసరాలను నిశితంగా పరిశీలించారు. అనంతరం కలెక్టర్ మాట్లాడుతూ.. రాజీవ్ గాంధీ ఆడిటోరియంను ఆధునికీకరించేందుకు అవసరమైన చర్యలు చేపట్టాలని సంబంధిత అధికారులను ఆదేశించారు.