SKLM: గురువారం వైసీపీ పార్టీ ఆవిర్భావ దినోత్సవం సందర్భంగా రణస్థలం మండలం జిఆర్ పురం వద్ద ఉన్న వైఎస్ రాజశేఖర్ రెడ్డి విగ్రహానికి పూలమాలవేసి నివాళులర్పించనున్నట్లు వైసీపీ నేతలు తెలిపారు. అనంతరం రణస్థలం పార్టీ కార్యాలయంలో మాజీ ఎమ్మెల్యే గొర్లె కిరణ్ కుమార్ సమక్షంలో ఆవిర్భావ దినోత్సవ వేడుకల నిర్వహించనున్నామన్నారు. వైసీపీ కార్యకర్తలు పాల్గొనాలని పిలుపునిచ్చారు.