VZM: రామతీర్థం గ్రామంలో మురుగు సమస్య తీవ్రంగా మారింది. ప్రధాన వీధిలో చేపట్టిన రహదారి పనుల కారణంగా కాలువల్లో మట్టి చేరి నీటి ప్రవాహం ఆగిపోయింది. దీంతో వాడుక నీరు నిల్వ ఉండి దుర్వాసన వ్యాపిస్తోంది. దోమల పెరుగుదలతో స్థానికులు ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. సమస్యను త్వరగా పరిష్కరించాలని గ్రామస్తులు కోరుతున్నారు.