KDP: దువ్వూరు మండల పరిధిలోని కడప – కర్నూలు జాతీయ రహదారిలో పెద్ద జొన్నవరం మెట్ట సమీపం నందు శుక్రవారం సాయంత్రం రెండు కార్లు ఢీకొన్నాయి. ఈ ఘటనలో ముగ్గురికి తీవ్ర గాయాలైనట్లు సమాచారం. గాయాలు పాలైన వారిని స్థానికులు 108 వాహనం సాయంతో ప్రభుత్వాసుపత్రికి తరలించారు. పోలీసులు సంఘటనా స్థలానికి చేరుకుని ట్రాఫిక్ అంతరాయం ఏర్పడకుండా ఏర్పాట్లు చేపట్టారు.