VKB: తాండూరుకు చెందిన మోయిజ్ జాతీయ స్థాయి షూటింగ్ బాల్ పోటీలకు ఎంపికయ్యాడు. ఈనెల 7, 9తేదీల్లో నేపాల్లోని ఖాట్మండులో జరిగే ‘షూటింగ్ బాల్ సిరీస్-2026’లో భారత్ తరపున ఆయన ప్రాతినిధ్యం వహించనున్నాడు. ఇందిరానగర్కు చెందిన మోయిజ్ తండ్రి లారీ డ్రైవర్గా పనిచేస్తున్నారు. సాధారణ కుటుంబం నుంచి అంతర్జాతీయ స్థాయి పోటీలకు ఎంపికైన యువకుడిని గ్రామస్థులు అభినందిస్తున్నారు.