HYD: మినరల్ వాటర్ ప్లాంట్లలో నీటి నాణ్యతపై జీహెచ్ఎంసీ ప్రత్యేక తనిఖీలు నిర్వహించింది. మొత్తం 26 చోట్ల పరిశీలించి, 27 నీటి నమూనాలను సేకరించి ప్రయోగశాలకు పంపింది. వీటిలో ఎక్కువగా లూజ్ డ్రింకింగ్ వాటర్ యూనిట్ల నుంచే నమూనాలు తీసుకున్నారు. నిబంధనలు పాటించని 6 యూనిట్లకు మెరుగుదల నోటీసులు జారీ చేశారు. ప్రజారోగ్య రక్షణ కోసం కఠిన చర్యలు కొనసాగుతున్నాయి.