WGL: రాయపర్తి మండలం జేతురాం తండాలో విద్యుత్ శాఖ ఆధ్వర్యంలో శనివారం ‘ప్రజా బాట’ కార్యక్రమం నిర్వహించారు. ఈ సందర్భంగా ఏఈ కుంట శ్రీధర్ తండావాసులతో ముఖాముఖి నిర్వహించి వారి విద్యుత్ సమస్యలను తెలుసుకున్నారు. ఎస్ఎస్-52 ట్రాన్స్ఫార్మర్ వెంటనే మరమ్మతు చేయించారు. నాణ్యమైన విద్యుత్ సరఫరా అందించడమే లక్ష్యమని ఏఈ తెలిపారు.