CTR: పలమనేరు పరిరక్షణ సమితి సభ్యులు పట్టణ సమస్యలపై మున్సిపల్ కమిషనర్ ఎన్వీ రమణారెడ్డికి వినతిపత్రం సమర్పించారు. వేసవిలో తాగునీటి కొరత నివారణ, ప్రజారోగ్యం, పారిశుద్ధ్య మెరుగుదల, ట్రాఫిక్ సమస్యల పరిష్కారం వంటి అంశాలను ప్రస్తావించారు. ఈ కార్యక్రమంలో పీపీఎస్ అధ్యక్షుడు నరసింహులు, కార్యదర్శి నారాయణ తదితరులు పాల్గొన్నారు.