KDP: సిద్ధవటం మండలం మాధవరం-1 పరిధి బంగారుపేట గ్రామంలో వెలసిన శ్రీ భద్రావతి భావనారాయణ, సీతారాముల సంయుక్త దేవాలయంలో శనివారం రాత్రి సీతారాముల కళ్యాణం మహోత్సవం వైభవంగా జరిగింది. పూజారులు వేద మంత్రోచ్చారణల మధ్య సంప్రదాయబద్ధంగా కార్యక్రమాన్ని నిర్వహించారు. కళ్యాణ మహోత్సవాన్ని తిలకించడానికి భక్తులు పెద్ద సంఖ్యలో హాజరయ్యారు. అనంతరం భక్తులకు తీర్థ ప్రసాదాలు అందజేశారు.