ప్రకాశం: రాయవరం బస్సు ప్రమాదంలో మరణించిన కనిగిరి మండలం లింగారెడ్డిపల్లి పంచాయతీ మండాదిరివారిపల్లి గ్రామానికి చెందిన ఉప్పు రమాదేవి కుటుంబాన్ని వైసీపీ ఇంఛార్జ్ దద్దాల నారాయణ యాదవ్ ఆదివారం పరామర్శించారు. వైసీపీ జిల్లా అధ్యక్షుడు బూచేపల్లి శివ ప్రసాద్ రెడ్డి ప్రకటించిన రూ.1 లక్ష ఆర్థిక సహాయాన్ని కుటుంబ సభ్యులకు అందజేశారు. ఆమె మృతికి ప్రగాఢ సానుభూతి తెలిపారు.