SRD: రైతులు ఆయిల్ పామ్ పంట సాగు చేసేలా అధికారులు ప్రోత్సహించాలని వ్యవసాయ శాఖ ప్రధాన కార్యదర్శి సురేంద్ర మోహన్ అన్నారు. కొండాపూర్ మండలం తెరిపోల్ గ్రామంలో ఆదివారం పర్యటించారు. ఆయన మాట్లాడుతూ.. రైతులు వరి, మొక్కజొన్న, చెరుకు బదులుగా ఆయిల్ పామ్ సాగు చేయాలని చెప్పారు. కార్యక్రమంలో జిల్లా వ్యవసాయ శాఖ అధికారి శివప్రసాద్ పాల్గొన్నారు.