KRNL: జాతీయ స్థాయి పవర్ లిఫ్టింగ్ పోటీలకు ఎంపికైన మంత్రాలయం ZPHS విద్యార్థులకు సోమవారం వైసీపీ జిల్లా ఉపాధ్యక్షుడు ప్రదీప్ రెడ్డి ఆర్థిక సాయం అందించారు. ఈ నెల 20 నుంచి 28 వరకు రాజస్థాన్లో జరగనున్న పోటీలకు వెళ్లే ముగ్గురు విద్యార్థులకు రూ.20 వేలు అందజేశారు. క్రీడాకారులను ప్రోత్సహించడం అభినందనీయమని వ్యాయామ ఉపాధ్యాయుడు రవీంద్ర నరసింహ రాజు పేర్కొన్నారు.