విశాఖ దక్షిణ నియోజకవర్గం 34వ వార్డు కొబ్బరితోట ప్రాంతానికి చెందిన క్యాన్సర్ బాధితురాలు చింతల సత్యను మాజీ ఎమ్మెల్యే వాసుపల్లి గణేష్ కుమార్ ఆదివారం పరామర్శించారు. ఈ మేరకు ఆమె అనారోగ్య పరిస్థితిని తెలుసుకొని, ధైర్యం చెప్పారు. ఈ సందర్భంగా తన సొంత నిధుల నుంచి రూ.5,000 నగదు, బియ్యం బస్తా అందజేసి అండగా ఉంటామని హామీ ఇచ్చారు.