AKP: జగ్జీవన్ రామ్ పేరుతో నిర్మించే ఉత్తరాంధ్ర సుజల స్రవంతి ప్రాజెక్టును త్వరితగతిన పూర్తిచేయాలని సీపీఐ పాయకరావుపేట మండల కార్యదర్శి వి. అర్జున్ రావు డిమాండ్ చేశారు. ఆదివారం స్థానిక శబరి కాలనీలో జగ్జీవన్ రామ్ జయంతి కార్యక్రమంలో పాల్గొన్నారు. ఈ ప్రాజెక్టు భూసేకరణకు రూ.1,000 కోట్లు ఖర్చు అవుతుందని అంచనా వేయగా బడ్జెట్లో రూ. 600 కోట్లు కేటాయించారన్నారు.