VZM: రాష్ట్ర పురపాలిక, పట్టణాభివృద్ధి శాఖ మంత్రి నారాయణ బొబ్బిలికి వరాల జల్లు కురిపించారు. వివిధ అభివృద్ధి పనుల నిమిత్తం ఆయన మూడున్నర కోట్లు మంజూరు చేస్తున్నట్లు ప్రకటించారు. ఆయన ఆదివారం బొబ్బిలి పర్యటనలో భాగంగా రాణి మల్లమాదేవి పార్కును సందర్శించారు. ఆనంతరం ఆయన మాట్లాడుతూ.. పట్టణ అభివృద్ధికి అన్ని విధాలుగా సహాయ సహకారాలు అందిస్తానని హామీ ఇచ్చారు.