CTR: పూతలపట్టు నియోజకవర్గంలో తిరుమల తిరుపతి దేవస్థానం ఛైర్మన్ బీ.ఆర్.నాయుడును వెంటనే తొలగించాలని వైసీపీ నేతలు డిమాండ్ చేశారు. పాలేరు హైవే సాయిబాబా ఆలయంలో మాజీ ఎమ్మెల్యే డాక్టర్ సునీల్ కుమార్ ఆధ్వర్యంలో ప్రత్యేక పూజలు నిర్వహించారు. తిరుమల పవిత్రతను కాపాడాలని, నాయుడుపై చర్యలు తీసుకోవాలని కోరారు. ఈ కార్యక్రమంలో పలువురు పార్టీ నాయకులు పాల్గొన్నారు.