BDK: విద్యానగర్ పంచాయతీ పరిధిలోని సారయ్య కాలనీలో మిషన్ భగీరథ అధికారులతో కలిసి సర్పంచ్ శాంతిశ్రీ శనివారం పర్యటించారు. చుంచుపల్లి విద్యానగర్ పంచాయతీలో వేసవి కాలాన్ని దృష్టిలో ఉంచుకుని తాగునీటి సరఫరా మెరుగుదలకు పాలకవర్గం చర్యలు చేపట్టిందని తెలిపారు. కాలనీలో కొత్తగా పైప్ లైన్ ఏర్పాటు, ట్యాంకు నిర్మాణ పనులను క్షేత్రస్థాయిలో పరిశీలించినట్లు పేర్కొన్నారు.