BDK: పినపాక మండలంలోని బోటుగూడెం గ్రామంలో సెర్ఫ్ పర్యవేక్షణలో శనివారం సిఆర్పిలు ఇంటింటి సర్వే నిర్వహించారు.పేదరికాన్ని కచ్చితంగా అంచనా వేసి, అర్హులను గుర్తించడమే ఈ సర్వే ప్రధాన లక్ష్యమని అధికారులు తెలిపారు. ప్రతి కుటుంబాన్ని సందర్శించి వారి ఆర్థిక స్థితిగతులు, జీవన ప్రమాణాలు, ఇతర అవసరాల వివరాలను సేకరించారు.