HNK: హనుమకొండ జిల్లాకు చెందిన పలువురు నేతలు జాగృతి అధ్యక్షురాలు కల్వకుంట్ల కవిత సమక్షంలో తెలంగాణ జాగృతిలో చేరారు. కవిత మాట్లాడుతూ.. జాగృతి విధానాలను ప్రజల్లోకి నేతలు విస్తృతంగా తీసుకెళ్లాలని, అనునిత్యం ప్రజలకు అందుబాటులో ఉంటూ ప్రజా సమస్యల పరిష్కారానికి కృషి చేయాలని అన్నారు. జిల్లా అధ్యక్షులు శ్రీశైలం, శ్రీకాంత్ గౌడ్ ఉన్నారు.