AP: ఇటీవల రాష్ట్రంలో జరిగిన పరిణామాలపై సీఎం చంద్రబాబు ఆవేదన వ్యక్తం చేశారు. బాణాసంచా ప్రమాదం, శ్రీకాకుళం డయేరియా, రాజమండ్రి కల్తీ ఘటనలు చాలా బాధించాయని వెల్లడించారు. ఇలాంటి ఘటనలు పునరావృతం కాకుండా చర్యలు తీసుకోవాల్సిన బాధ్యత అధికారులదేనని పేర్కొన్నారు. ప్రమాదాలు జరగకుండా ఎప్పటికప్పుడు క్షేత్రస్థాయిలో పర్యవేక్షించాలని అధికారులకు సూచించారు.