KMR: బీబీపేటలోని జనగామలో వేసవి కాలాన్ని దృష్టిలో ఉంచుకుని తాగునీటి ఎద్దడి నివారణకు ముందస్తు చర్యలు చేపట్టారు. వార్డుల్లో తాగునీటి ఇబ్బందులు కలగకుండా కొత్తగా బోర్లు తవ్వించి, వాటికి మోటార్లు అమర్చారు. దీనివల్ల గ్రామస్తులకు తాగునీటి సరఫరా మెరుగుపడుతుందని సర్పంచ్ శ్రీనివాస్ తెలిపారు. వేసవిలో ప్రజలకు నీటి కష్టాలు కలగకుండా జాగ్రత్తలు తీసుకుంటున్నట్లు తెలిపారు.