SKLM: అమరావతిలో సీఎం చంద్రబాబు అధ్యక్షతన నిర్వహిస్తున్న 6వ జిల్లా కలెక్టర్ల సమావేశంలో కలెక్టర్ స్వప్నిల్ దినకర్ పుండ్కర్ బుధవారం పాల్గొన్నారు. ఈ సమావేశంలో జిల్లాలో జరుగుతున్న పలు అభివృద్ధి కార్యక్రమాల పురోగతిపై చర్చించారు. ప్రభుత్వ సంక్షేమ పథకాల అమలు, ప్రజలకు అందుతున్న సేవలపై సమీక్ష నిర్వహించినట్లు సమాచారం.