HNK: రంజాన్ పర్వదినాన్ని పురస్కరించుకొని పరకాల పట్టణంలోని జామా మసీదులో ఇఫ్తార్ విందును ఏర్పాటు చేశారు. ఇఫ్తార్ విందుకు మార్కెట్ కమిటీ చైర్మన్ రాజిరెడ్డి, మున్సిపల్ వైస్ చైర్మన్ ఏకు దివ్య విద్యాసాగర్ హాజరయ్యారు. పరకాల పట్టణంలో రంజాన్ పండుగ వేడుకలను ప్రశాంత వాతావరణంలో జరుపుకోవాలని, రంజాన్ పండుగ సోదరభావం, శాంతి, సామరస్యానికి ప్రతీక అని వారు అన్నారు.