HNK: రాష్ట్రంలో చేపడుతున్న జై భీమ్ మహాసేన రథయాత్ర జిల్లాకు చేరుకుంది. యాత్ర చేస్తున్న వారికి హనుమకొండ అంబేద్కర్ సెంటర్ వద్ద కుల వివక్ష వ్యతిరేక పోరాట సంఘం(KVPS) నేతలు ఘన స్వాగతం పలికారు. విద్యాభ్యాసం నుంచే భారత రాజ్యాంగాన్ని పాఠ్యాంశంగా చేర్చాలని, భారత రాజ్యాంగ పరిరక్షణకు ప్రతి ఒక్కరు కృషి చేయాలని నేతలు అన్నారు.