SRD: సంగారెడ్డి పట్టణంలోని ప్రభుత్వ అతిథి గృహం నుంచి బసవేశ్వర విగ్రహం వరకు బైపాస్ రోడ్డు పనులు నాణ్యతగా చేయాలని టీపీసీసీ వర్కింగ్ ప్రెసిడెంట్ జగ్గారెడ్డి సూచించారు. రోడ్డు పనులను బుధవారం ఆయన పరిశీలించారు. రోడ్డు పనుల్లో వేగం పెంచాలని కాంట్రాక్టర్కు సూచించారు. కార్యక్రమంలో మున్సిపల్ వైస్ ఛైర్మన్ షఫీ అహ్మద్, కాంగ్రెస్ పట్టణ అధ్యక్షుడు జార్జి పాల్గొన్నారు.