CTR: లారీ డ్రైవర్కు కోర్టు జైలు శిక్ష విధించినట్టు పోలీసులు బుధవారం తెలిపారు. గత సంవత్సరం ఏప్రిల్లో గంగవరం మండలానికి చెందిన సహదేవప్ప తన భార్యతో కలిసి బైక్పై వెళ్తుండగా మేలుమయి క్రాస్ వద్ద లారీ ఢీకొనడంతో మృతి చెందాడు. నిర్లక్ష్యంగా లారీ నడిపినట్టు రుజువు కావడంతో డ్రైవర్ గణేష్కు పలమనేరు కోర్టు ఆరు నెలలు జైలు శిక్ష విధించినట్లు వారు చెప్పారు.