NRPT: జనాభా అన్నింటికీ ప్రామాణికం అని, సంక్షేమ పథకాల రూపకల్పనలో ఎంతో ఉపయోగపడుతుందని స్థానిక సంస్థల అదనపు కలెక్టర్ ఫణిందర్ రెడ్డి అన్నారు. బుధవారం నారాయణపేట కలెక్టరేట్లో 2027 జనగణనపై ఏర్పాటు చేసిన 3 రోజుల శిక్షణ కార్యక్రమాన్ని ఆయన ప్రారంభించారు. ఒక దేశానికి జనగణన అతి ముఖ్యమని, 11 ఏళ్ల తర్వాత కేంద్ర ప్రభుత్వం జనగణన చేపడుతోందని అధికారులకు సూచించారు.