GDWL: ప్రభుత్వ పాఠశాల విద్యార్థులకు మెనూ ప్రకారం క్వాలిటీ ఫుడ్ అందించాలని అయిజ ఎంపీడీవో భాస్కర్ సూచించారు. బుధవారం మండలంలోని ఎక్లాస్పూర్ ప్రాథమిక పాఠశాలను ఆకస్మిక తనిఖీ చేశారు. విద్యార్థులకు ఇస్తున్న రాగిజావను తాగి, మధ్యాహ్న భోజనాన్ని పరిశీలించారు. కిచెన్ షెడ్ పరిసరాలు పరిశుభ్రంగా ఉంచుకోవాలని, వంటకు నాణ్యమైన కూరగాయలు వాడాలని సూచించారు.