NGKL: జిల్లా కేంద్రంలోని 22వ వార్డులో నూతనంగా ఏర్పాటు చేసిన విద్యుత్ ట్రాన్స్ఫార్మర్ను ఎమ్మెల్యే డాక్టర్ కూచుకుళ్ల రాజేశ్ రెడ్డి ఇవాళ ప్రారంభించారు. పట్టణంలో విద్యుత్ సమస్యల పరిష్కారానికి ప్రభుత్వం కట్టుబడి ఉందని ఆయన తెలిపారు. కొత్త ట్రాన్స్ఫార్మర్ వల్ల లో-ఓల్టేజీ సమస్య తగ్గి, వార్డు ప్రజలకు మెరుగైన విద్యుత్ సరఫరా అందుతుందని ఎమ్మెల్యే పేర్కొన్నారు.