KNR: ప్రజా పాలన ప్రగతి ప్రణాళికపై సర్పంచులు, వార్డు సభ్యులు, కార్పొరేటర్లు, కౌన్సిలర్లను ఆకట్టుకునే రీతిలో ప్రజెంటేషన్ ఇవ్వాలని, జిల్లా కలెక్టర్ చిత్రా మిశ్రా అధికారులను ఆదేశించారు. కరీంనగర్ కలెక్టరేట్లో జరిగిన సమావేశంలో ఆమె మాట్లాడుతూ.. సమగ్రమైన వివరాలు స్లైడ్స్, వీడియోలతో సహా సిద్ధం చేయాలన్నారు. సర్పంచులు, వార్డు సభ్యుల విధులు వివరించాలన్నారు.