MBNR: అన్ని కులాలు, మతాల మధ్య సోదర భావం ఐక్యత పెంపొందాలని టీపీసీసీ ప్రధాన కార్యదర్శి ఏపీ మిథున్ రెడ్డి అన్నారు. మహబూబ్ నగర్ నియోజకవర్గం హన్వాడ మండల కేంద్రంలో ఏర్పాటు చేసిన ఇఫ్తార్ విందులో ఆయన పాల్గొన్నారు. ఈ సందర్భంగా మైనార్టీ సోదరులకు ఆయన రంజాన్ శుభాకాంక్షలు తెలియజేశారు. కార్యక్రమంలో బోనాల శ్రీనివాసులు దాసరి నరసింహులు తదితరులు పాల్గొన్నారు.