SRD: పటాన్చెరులో అంతర్జాతీయ మహిళా దినోత్సవం సందర్భంగా ఎమ్మెల్యే గూడెం మహిపాల్ రెడ్డి ఆధ్వర్యంలో నిర్వహిస్తున్న మహిళా క్రీడోత్సవాలు రెండో రోజైన బుధవారం ఘనంగా కొనసాగాయి. మైత్రి మైదానంలో జరిగిన పోటీలను ఎమ్మెల్యే జీఎంఆర్, గూడెం యాదమ్మతో కలిసి వీక్షించారు. ఈనెల 12న జీఎంఆర్ కన్వెన్షన్ సెంటర్లో నియోజకవర్గ స్థాయి మహిళా దినోత్సవ వేడుకలు నిర్వహించనున్నట్లు తెలిపారు.